News July 25, 2024
నెల్లూరు- ముంబై హైవేపై ప్రమాదం

మర్రిపాడు మండలం, నెల్లూరు- ముంబై జాతీయ రహదారిపై అచ్చమాంబ ఆలయం వద్ద గత రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న పాదచారుడిని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు దీంతో అతనిని చికిత్స నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. గాయపడిన వ్యక్తి చిరివెళ్లకు చెందిన నర్సారెడ్డిగా గుర్తించారు.
Similar News
News July 4, 2025
20 బైకులను ప్రారంభించిన SP

జిల్లాలో రాత్రిళ్లు నిఘాను మరింత పెంచేందుకు చర్యలు చేపట్టినట్లు SP కృష్ణ కాంత్ తెలిపారు. ఇందులో భాంగంగా 20 బైకులను ఆయన శుక్రవారం ప్రారంభించారు. పగలు, రాత్రిళ్లు గస్తీకి వీటిని వాడనున్నట్లు స్పష్టం చేశారు. నెల్లూరు ట్రాఫిక్, నెల్లూరు టౌన్, రూరల్, ఆత్మకూరు, కావలి, కందుకూరు సబ్ డివిజన్లకు వాటిని కేటాయించినట్లు తెలిపారు.
News May 8, 2025
హై కోర్టులో కాకాణి బెయిల్ పిటిషన్.. తీర్పు వాయిదా

మాజీ మంత్రి కాకాణికి హైకోర్టులో ఊరట దక్కలేదు. పొదలకూరు(మ) వరదాపురంలో అక్రమ మైనింగ్కు సంబంధించి ఆయనపై కేసు నమోదైంది. గిరిజనులను బెదిరించారనే ఆరోపణలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును పోలీసులు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం కాకాణి వేసిన పిటీషన్పై గురువారం హైకోర్టులో వాదనలు జరిగాయి. కోర్టు.. తీర్పును జూన్ 16కు వాయిదా వేసింది. కాకాణి పరారీలో ఉన్న విషయం తెలిసిందే.
News May 8, 2025
నుడా వీసీగా జేసీ కార్తీక్

నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్(నుడా) వైస్ ఛైర్మన్గా జాయింట్ కలెక్టర్ కార్తీక్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో నుడా వీసీగా నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ సూర్యతేజ పనిచేశారు. ఆయన ఇటీవలే బదిలీ అయ్యారు. గత కొద్ది రోజులుగా ఆ పోస్టు ఖాళీగా ఉంది. దీంతో జేసీని నుడా వైస్ ఛైర్మన్గా ప్రభుత్వం నియమించింది.