News July 25, 2024

పొత్తు కోసం జగన్ ఢిల్లీ వెళ్లినట్లుంది: మంత్రి పయ్యావుల

image

AP: ఇండియా కూటమితో పొత్తు కోసమే జగన్ ఢిల్లీ వెళ్లినట్లుందని మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. ‘ఢిల్లీ నుంచి అమరావతికి వచ్చిన జగన్ అసెంబ్లీకి రావాలి. జగన్ చెప్తున్న రాజకీయ హత్యల వివరాలు సభలో పెట్టాలి. దీనిపై చర్చించి సమాధానం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఢిల్లీ రోడ్లపై శాంతి భద్రతలపై గగ్గోలు పెట్టడం దేనికి? లా అండ్ ఆర్డర్‌పై ఇవాళే శ్వేతపత్రం విడుదల చేస్తున్నాం’ అని తెలిపారు.

Similar News

News January 17, 2026

WCలో బంగ్లాదేశ్.. నేడు క్లారిటీ

image

T20 WCలో బంగ్లాదేశ్ జట్టు పాల్గొనడంపై నెలకొన్న సందిగ్ధతను తొలగించేందుకు <<18871702>>ఐసీసీ<<>> రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. భద్రతా కారణాలతో ముంబై, కోల్‌కతాలో తమ మ్యాచ్‌లు నిర్వహించవద్దని BCB కోరుతోంది. ఈ నేపథ్యంలో ICCకి చెందిన ఇద్దరు అధికారులు నేడు ఢాకాలో పర్యటించి BCB ప్రతినిధులతో చర్చలు జరపనున్నారు. దీంతో ఈ విషయంలో నేడు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

News January 17, 2026

నేడు ముక్కనుమే అయినా నాన్-వెజ్ ఎందుకు తినకూడదు?

image

ముక్కనుమ నాడు మాంసాహారం తినొచ్చు. కానీ, నేడు మాస శివరాత్రి, శనివారం వచ్చాయి. శివరాత్రి శివునికి ప్రీతికరమైనది. అందుకే సాత్వికాహారం తీసుకోవడం ఉత్తమం. అలాగే శనివారం శనిదేవుని, శ్రీనివాసుడి, హనుమాన్ ఆరాధనకు ఉద్దేశించిన రోజు. నియమ నిష్టలు పాటించాలి. ఇలాంటి పవిత్ర తిథి, వారాలు కలిసినప్పుడు మాంసాహారానికి దూరంగా ఉంటే మానసిక ప్రశాంతత, దైవ అనుగ్రహం లభిస్తాయి. అందుకే నేడు శాకాహారానికే ప్రాధాన్యత ఇవ్వండి.

News January 17, 2026

ఇంటి వద్దకే మేడారం ప్రసాదం

image

TG: మేడారం జాతర కోసం TGSRTC వినూత్న సేవలు ప్రారంభించింది. జాతరకు వెళ్లలేని భక్తులు రూ.299 చెల్లిస్తే ఇంటివద్దకే ప్రసాదం వస్తుంది. అమ్మవార్ల ఫొటో, పసుపు, కుంకుమ, బెల్లం ఉండే ప్యాకెట్‌ను సురక్షితంగా డెలివరీ చేస్తారు. ఈ సేవలు ఈ నెల 28 నుంచి 31వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో బుకింగ్‌కు అవకాశం ఉంది. www.tgsrtclogistics.co.in లేదా 040-69440069, 040-23450033ను సంప్రదించవచ్చు.