News July 25, 2024

మరణంలోనూ వీడని తల్లీకుమారుల బంధం

image

విధి రాతకు బలైన ఓ కుటుంబ విషాదాంతమిది. HYDలో తన భార్య, కుమారులతో కలిసి ఉంటున్న గుంజి శివ కొన్ని నెలల క్రితం అనారోగ్యంతో చనిపోయారు. కుటుంబ పోషణ, పిల్లల కాలేజీ ఫీజులకూ డబ్బుల్లేక తల్లి గత రాత్రి ఉరి వేసుకుంది. తల్లి మరణాన్ని తట్టుకోలేక పెద్ద కొడుకు వంశీ(18) క్షణాల్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదాన్ని చూసి రెండో కుమారుడి గుండెలు పగిలాయి. ఒంటరిగా మిగిలానంటూ రోదించిన తీరు హృదయాలను కలిచివేసింది.

Similar News

News October 30, 2025

మార్గదర్శి కేసులో ఉండవల్లి ప్రతివాదే కాదు: AP ప్రభుత్వం

image

మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసును సుప్రీం విచారించింది. మాజీ MP ఉండవల్లి అరుణ్‌కుమార్ వర్చువల్‌గా వాదనలు వినిపిస్తూ సంస్థ RBI నిబంధనల ఉల్లంఘనపై విచారించాలన్నారు. అయితే ప్రధాన పిటిషన్‌పై విచారణలో వాటిని హైకోర్టుకు చెప్పాలని SC సూచించింది. ₹2300 CR డిపాజిట్లలో చాలా వరకు చెల్లించామని సంస్థ తరఫున సిద్ధార్థ్ లూథ్రా పేర్కొన్నారు. అటు కేసులో ఉండవల్లి ప్రతివాదే కాదని AP ప్రభుత్వ న్యాయవాది SCకి తెలిపారు.

News October 30, 2025

ఇంజినీరింగ్ అర్హతతో 30 పోస్టులు

image

నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్(NEEPCO) 30 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. బీటెక్, బీఈ ఉత్తీర్ణతతో పాటు GATE-2025 అర్హత సాధించిన అభ్యర్థులు నవంబర్ 17 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్య‌ర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. షార్ట్ లిస్టింగ్, గేట్ స్కోరు , ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://neepco.co.in

News October 30, 2025

గినీ కోళ్లను పెంచడం వల్ల రైతులకు లాభమేంటి?

image

కొందరు రైతులు పొలం దగ్గర గినీ కోళ్లను పెంచుతుంటారు. ఇవి చాలా చురుగ్గా ఉండి చిన్న అలికిడి అయినా వెంటనే స్పందిస్తాయి. కొత్త వ్యక్తులు, జంతువులు వస్తే ఇవి గట్టిగా అరుస్తూ రైతులను అలర్ట్ చేస్తాయి. ఇవి బాగా పరిగెత్తగలవు. పొలం చుట్టుపక్కల ఉన్న పాములను గుర్తించి చంపుతాయి. ఈ కారణంగానే పొలాలు, ఇంటి పరిసర ప్రాంతాల్లో ఎలుకలు, పాములు, పురుగులు, ఇతర చిన్న కీటకాల నివారణకు ఈ కోళ్లను ప్రత్యేకంగా పెంచుతుంటారు.