News July 25, 2024
సంజూకు మళ్లీ వన్డేల్లో అవకాశం వస్తుంది: ఉతప్ప

శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్లో చోటు దక్కలేదని సంజూ శాంసన్ నిరాశ చెందక్కర్లేదని మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప అన్నారు. అతనికి మళ్లీ ఛాన్స్ వస్తుందని చెప్పారు. సంజూకు చోటు దక్కకపోవడం ఇదే తొలిసారి కాదని, అలాగని ఇదే చివరి సారి అని చెప్పలేమన్నారు. ప్రతీ క్రికెటర్ ఈ పరిస్థితిని ఎదుర్కోక తప్పదన్నారు. కొత్త నాయకత్వం కుదురుకుంటే సంజూకు అవకాశం వస్తుందని అభిప్రాయపడ్డారు.
Similar News
News September 14, 2025
ఆ అమ్మవారికి పెరుగన్నమే ప్రీతి

నిర్మల్ జిల్లాలోని అడెల్లి పోచమ్మకు పెరుగన్నమంటే చాలా ప్రీతి. ఒకప్పుడు తీవ్రమైన కరవుతో అల్లాడిన ప్రజలను రక్షించడానికి శివుడు తన కుమార్తె పోచమ్మను ఇక్కడికి పంపాడని నమ్ముతారు. ఆమె కృప వల్లే ఇక్కడ వర్షాలు కురిసి, కరవు పోయిందని అంటారు. అందుకే అమ్మవారికి కోనేటి నీటితో వండిన అన్నంలో పెరుగు కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ఆలయం వద్దే వంటలు చేసుకొని పంక్తి భోజనాలు చేస్తారు.
News September 14, 2025
SBIలో 122 పోస్టులు

<
News September 14, 2025
కేజీ చికెన్ ధర రూ.280.. ఎక్కడంటే?

తెలుగు రాష్ట్రాల్లోని పలు చోట్ల చికెన్ ధరలు గత వారంతో పోలిస్తే స్వల్పంగా పెరిగాయి. TGలోని హైదరాబాద్, కామారెడ్డి, ఖమ్మంతో పాటు APలోని విజయవాడ, గుంటూరు, నంద్యాల, పల్నాడు, తూ.గో తదితర నగరాల్లో స్కిన్ లెస్ చికెన్ కేజీ రూ.230-240కి విక్రయిస్తున్నారు. అత్యధికంగా తిరుపతిలో రూ.280, అత్యల్పంగా కాకినాడలో రూ.220-230గా ఉంది. మీ ఏరియాలో రేట్ ఎంత? COMMENT