News July 25, 2024
HYD రైల్వే స్టేషన్లో భద్రాద్రి జిల్లా వాసి మృతి

మౌలాలి రైల్వే స్టేషన్లో ప్రయాణికుడు మృతి చెందాడు. సికింద్రాబాద్ రైల్వే పోలీసుల వివరాల ప్రకారం..భద్రాది జిల్లా పాల్వంచ వాసి షేక్ మహ్మద్ HYDలో ఉంటూ.. ఓ ఆసుపత్రిలో పని చేస్తున్నాడు. అనారోగ్యం కారణంగా సొంతూరికి వెళ్దామని సికింద్రాబాద్ స్టేషన్కు వచ్చాడు. కాకతీయ ఎక్స్ప్రెస్కు బదులు చెన్నై ట్రైన్ ఎక్కాడు. పొరపాటు తెలుసుకొని మౌలాలిలో రైల్ నుంచి దిగబోయాడు. ఒక్కసారిగా కింద పడిపోవడంతో మృతి చెందాడు.
Similar News
News December 30, 2025
BIG BREAKING: ఖమ్మం: ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు

TGలో మున్సిపల్ ఎన్నికల సందడి మొదలైంది. ఎన్నికల కమిషనర్ గిరిధర్ సుందర్ బాబు ఖమ్మం జిల్లాలోని ఏదులాపురం, కల్లూరు, మధిర, సత్తుపల్లి, వైరా మున్సిపాలిటీల కమిషనర్లతో నిర్వహించిన VCలో కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో మున్సిపల్ ఎన్నికలు ఫిబ్రవరిలో జరగనున్నాయి. రిజర్వేషన్ల గెజిట్ వెలువడగానే అధికారిక నోటిఫికేషన్ రానుంది. ఖమ్మం ఎన్నికలు GHMCతో పాటు మే నెలలో జరగనున్నాయి.
SHARE IT
News December 30, 2025
ఖమ్మం: రూ.2.5 లక్షలతో జర్మనీలో ఉద్యోగావకాశాలు

‘టామ్కామ్’ ఆధ్వర్యంలో నర్సులకు ఉచితంగా జర్మన్ భాషా శిక్షణ ఇచ్చి, జర్మనీలో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి శ్రీరామ్ తెలిపారు. బీఎస్సీ లేదా జీఎన్ఎమ్ పూర్తి చేసి, ఏడాది క్లినికల్ అనుభవం ఉన్న 22-38 ఏళ్ల వారు అర్హులు. ఎంపికైన వారికి శిక్షణ అనంతరం నెలకు రూ.2.5 నుంచి 3 లక్షల వేతనం లభిస్తుంది. ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
News December 30, 2025
చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు: ఖమ్మం CP

సంక్రాంతి పండుగ వేళ పక్షులు, ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతున్న నిషేధిత చైనా మాంజాను విక్రయించినా, వినియోగించినా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ హెచ్చరించారు. పక్షుల విహారానికి, ప్రజల భద్రతకు భంగం కలిగించే ఈ మాంజా విక్రయాలపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. ఎవరైనా చైనా మాంజాను విక్రయిస్తున్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 100కి లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.


