News July 26, 2024

ఈ భారత అథ్లెట్లకు ఇదే చివరి ఒలింపిక్స్

image

ముగ్గురు భారత అథ్లెట్లు తరుణ్‌దీప్ రాయ్ (ఆర్చరీ), ఆచంట శరత్ కమల్ (టేబుల్ టెన్నిస్), శ్రీజేశ్ (హాకీ)కు ఇదే చివరి ఒలింపిక్స్ కానుంది. ఇప్పటికే ఆర్చరీలో రాయ్ క్వార్టర్స్‌కు దూసుకెళ్లగా, ఈనెల 28న జరిగే మ్యాచ్‌తో శరత్ ఒలింపిక్స్ బరిలోకి దిగనున్నారు. గోల్ కీపర్‌గా రేపటి నుంచి ప్రారంభంకానున్న హాకీ మ్యాచుల్లో శ్రీజేశ్ పాల్గొంటారు. వీరికి హ్యాపీ ఎండింగ్ దక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. <<-se>>#Olympics2024<<>>

Similar News

News January 12, 2026

సీబీఐ విచారణకు విజయ్

image

కరూర్ తొక్కిసలాట కేసులో హీరో, టీవీకే చీఫ్ విజయ్ దళపతి సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఢిల్లీలోని సీబీఐ ఆఫీస్‌లో అధికారులు ఆయనను విచారిస్తున్నారు. గతేడాది సెప్టెంబర్ 27న విజయ్ ప్రచార సభలో తొక్కిసలాట జరిగి 41 మంది మరణించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది.

News January 12, 2026

మంత్రులు, అధికారులతో CM CBN కీలక భేటీ

image

AP: మంత్రులు, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులతో సీఎం చంద్రబాబు సచివాలయంలో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. రాష్ట్రాభివృద్ధి, పారదర్శక పాలన, మెరుగైన ప్రజా సేవలపై ఆయన సమీక్షిస్తున్నారు. జీఎస్డీపీ, ఆర్టీజీఎస్, పట్టాదారు పాస్ పుస్తకాలపైనా చర్చించనున్నారు. ఈ సమావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు కూడా వర్చువల్‌గా హాజరుకానున్నారు.

News January 12, 2026

మేడారం వెళ్తున్నారా? రూట్ మ్యాప్ ఇదే

image

TG: మేడారం జాతరకు ఈసారీ వన్ వే అమలు చేస్తున్నారు. WGL మీదుగా వచ్చే ప్రైవేటు వాహనాలను పస్రా టూ నార్లాపూర్ వైపునకు మళ్లిస్తారు. మహారాష్ట్ర, కరీంనగర్, BHPL నుంచి వచ్చే వాహనాలను కాల్వపల్లి మీదుగా ఊరట్టం పార్కింగ్ స్థలాల వరకు అనుమతిస్తారు. ఛత్తీస్‌గఢ్, ఖమ్మం వాహనాలను చిన్నబోయినపల్లి-కొండాయి నుంచి అనుమతిస్తారు. రిటర్న్ జర్నీకి ఇవే రూట్లు ఫాలో కావాలి. RTC, VIP వాహనాలకు తాడ్వాయి రూట్‌ను కేటాయించారు.