News July 26, 2024
నేడు ఆర్థిక శాఖపై అసెంబ్లీలో శ్వేతపత్రం

AP: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం నేడు అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేయనుంది. రూ. 11 లక్షల కోట్లకు పైగా అప్పులు ఉన్నట్లు సర్కారు తేల్చింది. పెండింగ్లో ఉన్న బిల్లులు రూ.1.41 లక్షల కోట్లని, వాటిలో ప్రాజెక్టులకు సంబంధించి రూ.19,324 కోట్ల బకాయిలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఆర్థిక శాఖలో రూ.19,549 కోట్లు, పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధి శాఖలో రూ.7700 కోట్ల బకాయిలున్నట్లు సమాచారం.
Similar News
News April 18, 2026
చెన్నైకి ఆరెంజ్ ఆర్మీ షాకిస్తుందా?

ఐపీఎల్లో CSKపై SRH రికార్డు పేలవంగా ఉంది. ఇరు జట్లు 22 సార్లు తలపడగా ఆరెంజ్ ఆర్మీ 7, చెన్నై 15 సార్లు గెలిచాయి. రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచుల్లో అత్యధిక స్కోర్ రికార్డు సీఎస్కే పేరిట (223/3) ఉంది. SRH 2024లో అత్యధికంగా 192 రన్స్ చేసింది. ఉప్పల్ స్టేడియంలో 2018 నుంచి చెన్నై గెలవలేదు. ఈసారి CSKతో పోలిస్తే సన్రైజర్స్ బలంగా కనిపిస్తోంది. మరి ఈ మ్యాచులో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.
News April 18, 2026
రైతుభరోసా రెండో విడత.. ఎల్లుండి ఖాతాల్లోకి డబ్బులు

TG: రైతు భరోసా రెండో విడత నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 20న భూపాలపల్లి జిల్లా కాటారంలో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఈ నిధులు విడుదల చేయనున్నారు. రెండో విడతలో 1-5 ఎకరాల్లోపు భూమి ఉన్న 45.11 లక్షల మంది రైతులకు రూ.5,653 కోట్లు జమ అవుతాయని వ్యవసాయశాఖ తెలిపింది. కాగా గత నెల 23న తొలి విడత కింద ఎకరం లోపు ఉన్న 68 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.3,590 కోట్లు జమ చేసింది.
News April 18, 2026
ఏపీలో ప్రతిపక్షమేది?

ఏపీలో ఉన్న మూడు పెద్ద ప్రాంతీయ పార్టీలు టీడీపీ, జనసేన, వైఎస్సార్సీపీ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయి. టీడీపీ, జనసేన అధికారికంగా పొత్తు పెట్టుకోగా.. జగన్ పొత్తు లేకపోయినా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ BJPకి వ్యతిరేకంగా ఉన్నా దానికి పెద్దగా ప్రజల మద్దతు దక్కడం లేదు. మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో సౌత్ రాష్ట్రాలన్నీ ఒక దారిలో ఉంటే ఏపీది మరో దారి. మరి ఏపీలో ప్రతిపక్షమేది?


