News July 26, 2024
స్వపక్షంలోనే విపక్షం: అసెంబ్లీలో మంత్రి సత్యకుమార్ యాదవ్

స్వపక్షంలోనే విపక్షం తయారైందని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ‘పలువురు ఎమ్మెల్యేలు తమ ప్రాంతాల్లోని వైద్య, ఆరోగ్య సమస్యలు చెప్పారు. అది మంచిదే. ప్రజారోగ్యం గురించి ఆలోచించి వారి నియోజకవర్గాల్లోని సమస్యలు చెప్తున్నారు. అధ్యక్షా.. గత ప్రభుత్వం వైద్యారోగ్య శాఖలో అవినీతికి పాల్పడింది. నియామకాల్లో రాజకీయ జోక్యంతో అవకతవకలకు పాల్పడింది’ అని అన్నారు.
Similar News
News January 20, 2026
ఇన్ఛార్జి కలెక్టర్కు ఆత్మీయ వీడ్కోలు

అనంతపురం జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ బదిలీ కావడంతో రెవెన్యూ భవనంలో మంగళవారం రాత్రి ఆత్మీయ వీడ్కోలు సభ నిర్వహించారు. రెవెన్యూ శాఖ, జిల్లా అధికారుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన సేవలను పలువురు కొనియాడారు. జిల్లా అభివృద్ధి, రెవెన్యూ సమస్యల పరిష్కారంలో ఆయన చూపిన చొరవ అభినందనీయమన్నారు. అధికారుల అభినందనల మధ్య ఆయనను ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు.
News January 20, 2026
జేఎన్టీయూ-ఏ ఫలితాలు విడుదల

అనంతపురం జేఎన్టీయూ పరిధిలో నిర్వహించిన M.Tech (R21), M.Sc (R21) రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్ నాగప్రసాద్ నాయుడు, కంట్రోలర్ శివకుమార్ ఈ ఫలితాలను ప్రకటించారు. విద్యార్థులు తమ ఫలితాల కోసం www.jntuaresults.in వెబ్సైట్ను సందర్శించాలని అధికారులు సూచించారు.
News January 20, 2026
అనంతపురం: ఉద్యోగుల వైద్య శిబిరానికి స్పందన

అనంతపురంలోని జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఇన్ఛార్జ్ కలెక్టర్ శివనారాయణ శర్మ ఆధ్వర్యంలో మంగళవారం ఉద్యోగుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కాగా ఉద్యోగుల నుంచి విశేష స్పందన లభించింది. ఇన్ఛార్జ్ కలెక్టర్తోపాటు కలెక్టరేట్, రెవెన్యూ, సర్వే ఉద్యోగులు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అందరికీ ఉచితంగా మందులు పంపిణీ చేశారు.


