News July 26, 2024
ఆదర్శంగా ఉంటూ పోలీసులు క్రమశిక్షణతో మెలగాలి: ఎస్పీ

అందరికీ ఆదర్శంగా ఉంటూ పోలీసులు క్రమశిక్షణతో మెలగాలని జిల్లా ఎస్పీ రత్న సూచించారు. శుక్రవారం సత్యసాయి జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో ఏఆర్ సాయిధ బలగాలు, హోంగార్డులు నిర్వహించిన పరేడ్ను తనిఖీ చేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. మరింత నిబద్ధత, క్రమశిక్షణతో పని చేయాలన్నారు. ఆగస్టు 17 నాటికి మరింత మెరుగుపరచుకోవాలన్నారు. సమాజంలో అందరికీ జవాబుదారిగా ఉండాలన్నారు.
Similar News
News July 10, 2025
‘విద్యార్థులారా.. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి’

అనంతపురం JNTUలో స్వీడన్ బ్యాచ్ కోర్స్ను ప్రారంభించినట్లు వీసీ సుదర్శన రావు, రిజిస్ట్రార్ కృష్ణయ్య, డైరెక్టర్ సుజాత తెలిపారు. 4 ఏళ్ల బీటెక్ CSE/ECE కోర్సులో మొదట మూడేళ్లు JNTUలో, 4వ ఏడాది స్వీడన్లో చదవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ఈనెల 17వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు JNTUలోని డైరెక్టర్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.
News July 8, 2025
మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టాలి: కలెక్టర్

పాఠశాలలో ఈనెల 10న జరగనున్న మెగా పేరంట్, టీచర్స్ మీటింగ్ 2.0 కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని అధికారులను అనంతపురం కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయం నుంచి మండల విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మీటింగ్లో తల్లితండ్రులను భాగస్వాములను చేయాలన్నారు. పాఠశాలల అభివృద్ధి గురించి వివరించాలన్నారు.
News July 7, 2025
రాయదుర్గంలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

రాయదుర్గంలోని గ్యాస్ గోడౌన్ ఏరియాలో నివాసముంటున్న చాంద్బాషా ఆదివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసుల వివరాల మేరకు.. బాషా ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ జీవితంపై విరక్తి చెంది రైలు పట్టాల మీద కూర్చున్నాడు. ఈ క్రమంలో రైలు ఢీ కొట్టింది. గమనించిన లోకోపైలట్ సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని రాయదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించామన్నారు.