News July 26, 2024
అమెరికా కాంగ్రెస్లో భారత్పై కీలక బిల్లు

సెనేటర్ మార్కో రుబియో US కాంగ్రెస్లో ఓ బిల్లు ప్రవేశపెట్టారు. డిఫెన్స్, ఇతర టెక్నాలజీ బదిలీలో జపాన్, ఇజ్రాయెల్, కొరియా, నాటో పక్షాలతో సమాన హోదాను భారత్కు ఇవ్వడమే దీని ఉద్దేశం. పాక్కు నిధులు, ఇండో పసిఫిక్ ప్రాంతంలో US మిత్ర దేశాల సార్వభౌమత్వాన్ని సవాల్ చేస్తున్న చైనాను అడ్డుకొనేలా భారత్కు మద్దతివ్వడం మరో అంశం. అయితే ఎన్నికలు పూర్తై కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాకే ఈ బిల్లుకు ఆమోదం లభించొచ్చు.
Similar News
News February 1, 2026
డ్యూటీలో ప్రాణాలు కోల్పోవడంపై సీఎం ఆవేదన

TG: నిజామాబాద్కు చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ <<19017490>>సౌమ్య<<>> మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. సౌమ్య మృతికి కారణమైన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఆమె కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు.
News February 1, 2026
కాటన్ యూనివర్సిటీలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు

గువాహటిలోని కాటన్ యూనివర్సిటీలో 9 జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీ, డాక్యుమెంట్స్ను ఫిబ్రవరి 9 వరకు పోస్ట్ చేయాలి. దరఖాస్తు ఫీజు రూ.1000, SC,STలకు రూ.500. వెబ్సైట్: https://cottonuniversity.ac.in/
News February 1, 2026
40% GST.. భారీగా పెరిగిన ధరలు

పొగాకు ఉత్పత్తులపై విధించిన 40% జీఎస్టీ నేటి నుంచి అమల్లోకి వచ్చింది. ఆ పన్నుతో పాటు అదనంగా ఎక్సైజ్ డ్యూటీ, హెల్త్ సెస్ విధించడంతో సిగరెట్లు, పాన్ మసాలా, గుట్కాల ధరలు భారీగా పెరిగాయి. హానికర ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అదే విధంగా ప్రభుత్వానికి అధిక ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అయితే మార్కెట్లో పొగాకు ఉత్పత్తుల ధరలు ఇప్పటికే పెంచి అమ్ముతున్నారు.


