News July 26, 2024
ఒలింపిక్స్: ఏ క్రీడలో ఎంతమంది పాల్గొంటున్నారంటే?

ఒలింపిక్స్లో మొత్తం 16 క్రీడల్లో 117 మంది భారత అథ్లెట్లు పాల్గొంటున్నారు. అథ్లెటిక్స్లో అత్యధికంగా 29మంది, వెయిట్ లిఫ్టింగ్, ఈక్వెస్ట్రియన్, జుడో, రోయింగ్లలో ఒక్కొక్కరు పాల్గొంటున్నారు. షూటింగ్ 21, హాకీ 19, టేబుల్ టెన్నిస్ 8, బ్యాడ్మింటన్ 7, రెజ్లింగ్ 6, బాక్సింగ్ 6, ఆర్చరీ 6, గోల్ఫ్ 4, టెన్నిస్ 3, సెయిలింగ్, స్విమ్మింగ్లో ఇద్దరు చొప్పున ఆడతారు. <<-se>>#Olympics2024<<>>
Similar News
News November 7, 2025
ప్రచారం తప్ప బాబు చేసిందేమీ లేదు: కన్నబాబు

AP: డేటా ఆధారిత పాలన అంటూ ప్రచారమే తప్ప CM CBN చేసిందేమీ లేదని మాజీ మంత్రి కన్నబాబు విమర్శించారు. ‘500 వాట్సాప్ సేవల ద్వారా ఆన్లైన్లోనే సమస్యలన్నిటినీ పరిష్కరిస్తున్నామని చెబుతున్నారు. మరి లోకేశ్ ప్రజాదర్బార్కు 4వేల అర్జీలు ఎందుకు వచ్చాయి? ప్రతిసారీ ఓ కొత్తపదంతో పబ్లిసిటీ చేసుకుంటూ మోసగించడం చంద్రబాబుకు అలవాటు’ అని విమర్శించారు. సచివాలయం వంటి వ్యవస్థలను తెచ్చి జగన్ చరిత్రలో నిలిచారన్నారు.
News November 7, 2025
సోషల్ జస్టిస్& ఎంపవర్మెంట్లో 49 ఉద్యోగాలు

<
News November 7, 2025
జీపీఎస్ స్పూఫింగ్ అంటే?

GPS స్పూఫింగ్ అనేది ఒక సైబర్ అటాక్. GPS సిగ్నల్లను మానిప్యులేట్ చేసి నావిగేషన్ వ్యవస్థలను తప్పుదారి పట్టిస్తారు. ఇలా ఫేక్ శాటిలైట్ సిగ్నల్లను ప్రసారం చేయడంతో విమానాలు ఫాల్స్ రూట్లలో వెళ్లే అవకాశముంది. ఓ చోట ఉన్న ఫ్లైట్ మరో చోట ఉన్నట్లు చూపిస్తుంది. దీని వల్ల ఫ్లైట్స్ టేకాఫ్/ల్యాండింగ్ అయ్యేటప్పుడూ ప్రమాదాలకు ఆస్కారముంటుంది. <<18227103>>ఢిల్లీ<<>>, ముంబైలో విమాన సేవల అంతరాయానికి ఇదే కారణమనే అనుమానాలున్నాయి.


