News July 26, 2024

వైసీపీ హయాంలో పారిశ్రామికవేత్తల్ని తరిమేశారు: CBN

image

AP: ఏపీకి పునర్వైభవాన్ని తీసుకొస్తామని గత ప్రభుత్వ ఆర్థిక అవకతవకలపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా CM చంద్రబాబు అన్నారు. ‘వైసీపీ హయాంలో అన్ని రంగాలు నష్టపోయాయి. రాష్ట్ర ఆదాయం తగ్గిపోయింది. అప్పులు పెరిగిపోయాయి. పారిశ్రామికవేత్తలను తరిమేశారు. కేంద్ర పథకాల నిధులను సరిగ్గా వినుయోగించుకోలేకపోయారు. కరెంట్, ఆర్టీసీ ఛార్జీలు, పన్నులు, నిత్యావసరాల ధరలను పెంచేశారు. చెత్తపైనా పన్ను వేశారు’ అని మండిపడ్డారు.

Similar News

News November 8, 2025

DEC 1 నుంచి పార్లమెంట్ సమావేశాలు

image

డిసెంబర్ 1 నుంచి 19 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపినట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేలా, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్మాణాత్మక చర్చల కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.

News November 8, 2025

AFCAT నోటిఫికేషన్ విడుదల

image

ఎయిర్‌ఫోర్స్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్(MPC), BE, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు శారీరక ప్రమాణాలు కలిగిన వారు NOV 10 నుంచి DEC 9 వరకు అప్లై చేసుకోవచ్చు. ఫ్లయింగ్ బ్రాంచ్‌కు 20-24ఏళ్లు, గ్రౌండ్ డ్యూటీ బ్రాంచ్‌కు 20-26ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ఫిజికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.56,00-రూ.1,77,500 చెల్లిస్తారు. కోర్సు 2027 JANలో ప్రారంభమవుతుంది.

News November 8, 2025

వేదాల గురించి ప్రముఖులు ఏమన్నారంటే..?

image

వేదాల గురించి భారతీయ ప్రముఖులు గొప్పగా ప్రవచించారు. ఆదిశంకరులు వేదాలను కన్నవాళ్ల కంటే అధిక హితాన్ని, శుభాలను కోరుకునేవిగా పేర్కొన్నారు. అవి మానవాళికి అత్యున్నత శ్రేయస్సును అందిస్తాయన్నారు. వివేకానందుడు వేదాలు అపూర్వమైన శక్తికి స్థానాలని చెప్పారు. వాటిని చదివితే ఈ లోకాన్ని ఇంకా శక్తిమంతం చేయొచ్చని చెప్పారు. వ్యక్తిగత, విశ్వ శ్రేయస్సుకు వేద జ్ఞానం మూలమని యువతకు మార్గనిర్దేశం చేశారు. <<-se>>#VedikVibes<<>>