News July 26, 2024

కాళేశ్వరం పూర్తి కావాలంటే ₹1.47లక్షల కోట్లు కావాలి: ఉత్తమ్

image

TG: గత ప్రభుత్వం కమీషన్ల కక్కుర్తి కోసం ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును నిలిపివేసిందని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు. ‘కాళేశ్వరం వ్యయం ₹38,500 కోట్ల నుంచి ₹80వేల కోట్లకు పెంచారు. ప్రాజెక్టు పూర్తి కావాలంటే కాగ్ లెక్కల ప్రకారం ₹1.47 లక్షల కోట్లు కావాలి. రన్నింగ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ. అన్ని పంపులను పూర్తి స్థాయిలో రన్ చేస్తే కరెంట్ బిల్లే ₹10వేల కోట్లు అవుతుంది’ అని జలసౌధలో ప్రెజెంటేషన్ ఇచ్చారు.

Similar News

News November 13, 2025

39పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

బ్రహ్మపుత్ర వ్యాలీ ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ లిమిటెడ్ 39 పోస్టులకు వేర్వేరుగా నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి బీఈ, బీటెక్, పీజీ, CA/ICWAI, డిప్లొమా, బీఎస్సీ(MPC), ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు డిసెంబర్ 9 వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష(CBT), ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://bvfcl.com/

News November 13, 2025

ప్రతి ఒక్కరూ వేదాలను ఎందుకు చదవాలి?

image

వేదాలు దైవిక నాదస్వరూపాలు. వీటిని రుషులు లోకానికి అందించారు. ఇవి మంత్రాల సముదాయం మాత్రమే కాదు. మనిషి జీవితానికి మార్గదర్శకాలు కూడా! ఇవి మనల్ని అసత్యం నుంచి సత్యానికి నడిపిస్తాయి. చీకటి నుంచి వెలుగు వైపుకు తీసుకెళ్తాయి. మృత్యువు నుంచి మోక్షం వైపుకు అడుగులు వేసేలా ప్రోత్సహిస్తాయి. నిత్య జీవితంలో ధైర్యాన్ని, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నతమైన లక్ష్యాన్ని చేరుకోవడానికి వేదాలు తోడ్పడతాయి. <<-se>>#VedikVibes<<>>

News November 13, 2025

రండి.. ట్రైనింగ్ ఇచ్చి వెళ్లిపోండి: అమెరికా

image

H1B వీసా విధానంపై అమెరికా ఆర్థికశాఖ మంత్రి స్కాట్ బెసెంట్ సంచలన కామెంట్లు చేశారు. ‘విదేశాల నుంచి వచ్చే వారిపై ఎక్కువ కాలం ఆధారపడకుండా అధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగాలు పొందేలా అమెరికన్లకు ట్రైనింగ్ ఇవ్వాలి. దానికోసం తాత్కాలికంగా విదేశీ కార్మికులను యూఎస్ తీసుకురావడమే H1B వీసా కొత్త విధానం. అమెరికన్లకు శిక్షణ ఇవ్వండి. తరువాత తిరిగి వెళ్లిపోండి. జాబ్స్‌ అన్నీ అమెరికన్లే తీసుకుంటారు’ అని చెప్పారు.