News July 26, 2024
Paytmకు మళ్లీ అచ్చే దిన్!

పేటీఎంకు మళ్లీ మంచిరోజులు వస్తున్నట్టున్నాయ్! కంపెనీ పేమెంట్ సర్వీసెస్ యూనిట్లో చైనా పెట్టుబడులకు కేంద్రం ఆమోదం తెలిపినట్టు సమాచారం. తుది అనుమతి రాగానే పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్స్ కోసం RBI వద్దకు పేటీఎం వెళ్లే ఛాన్స్ ఉంది. రూల్స్ పాటించకపోవడంతో కొత్త కస్టమర్లను చేర్చుకోకుండా 2023 మార్చిలో పేమెంట్స్ బ్యాంకుపై ఆర్బీఐ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. తాజా వార్తలతో పేటీఎం షేర్లు 10% ఎగిశాయి.
Similar News
News July 7, 2025
ఘోర ప్రమాదం.. 8 మంది మృతి

పంజాబ్లో ఘోర ప్రమాదం జరిగింది. హోషియార్పూర్లోని హాజీపూర్ రోడ్డులో బస్సు బోల్తా పడి 8 మంది మరణించారు. మరో 24 మంది గాయపడ్డారు. వీరిని ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతోనే ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుగా గుర్తించారు.
News July 7, 2025
ఆరెంజ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

TG: రాష్ట్రంలో నేటి నుంచి ఈ నెల 11 వరకు వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
News July 7, 2025
స్థానిక సంస్థలపై ఫోకస్: రామ్చందర్ రావు

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తమకు సవాల్ అని BJP రాష్ట్ర అధ్యక్షుడు రామ్చందర్ రావు అన్నారు. బలమైన ప్రతిపక్షం ఉంటే బైఎలక్షన్లో అధికార పార్టీ గెలవదని జోస్యం చెప్పారు. గతంలో స్థానిక సంస్థల ఎన్నికలపై BJP ఫోకస్ చేయలేదని, ఈ సారి వీటిపై ఫోకస్ పెడతామని స్పష్టం చేశారు. 25 రోజుల్లో పూర్తిస్థాయి రాష్ట్ర కమిటీని ప్రకటిస్తామని వెల్లడించారు. రాష్ట్ర కమిటీలో అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు.