News July 26, 2024

10ఏళ్ల తర్వాత ఆ జాబ్స్ ఉండవు: లింక్డ్‌ఇన్ కో-ఫౌండర్

image

లింక్డ్‌ఇన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్‌మన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. AI సాంకేతికత వల్ల వచ్చే పదేళ్లలో పలు రకాల ఉద్యోగాలు కనుమరుగు అయ్యే అవకాశం ఉందన్నారు. వీటిలో 9 టూ 5(టైమింగ్స్) జాబ్స్ ఉంటాయని తెలిపారు. 2034 నాటికి AI మానవ జీవితాన్ని మరింత సులభతరం చేస్తుందని చెప్పారు. దీంతో వర్క్ ఫోర్స్ విధానంలో మార్పులు చోటు చేసుకుంటాయన్నారు. ఇలాంటి సమయంలోనే మరింత దృష్టి సారించాలని సూచించారు.

Similar News

News November 11, 2025

యాపిల్ కొత్త ఫీచర్.. నెట్‌వర్క్ లేకున్నా మ్యాప్స్, మెసేజెస్!

image

మొబైల్ నెట్‌వర్క్‌ అందుబాటులో లేకున్నా మ్యాప్స్, మెసేజ్‌లు పనిచేసే ఫీచర్లను అందుబాటులోకి తెచ్చేందుకు యాపిల్ ప్రయత్నిస్తోందని బ్లూమ్‌బర్గ్ ఒక రిపోర్టులో తెలిపింది. యాపిల్‌కు చెందిన ఇంటర్నల్ శాటిలైట్ కనెక్టివిటీ గ్రూప్ ఇప్పటికే గ్లోబల్‌స్టార్‌ నెట్‌వర్క్‌తో కలిసి పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. శాటిలైట్ ద్వారా పనిచేసే ఎమర్జెన్సీ SOS ఫీచర్‌ను 2022లో విడుదల చేసిన iPhone14లోనే అందుబాటులోకి తెచ్చింది.

News November 11, 2025

థైరాయిడ్ వల్ల జుట్టు ఊడుతోందా?

image

కొంతమందిలో థైరాయిడ్ కంట్రోల్​లో ఉన్నప్పటికీ హెయిర్‌ఫాల్ అవుతుంటుంది. దీనికి విటమిన్ డి, కాల్షియం లోపం కారణం కావొచ్చంటున్నారు నిపుణులు. కాబట్టి చేపలు, గుడ్లు, పాల సంబంధిత ఉత్పత్తులు, నువ్వులు, డేట్స్, నట్స్ వంటి కాల్షియం రిచ్ ఫుడ్స్, డి విటమిన్ ఎక్కువగా ఉండే ఆహారాలు డైట్​లో చేర్చుకోవాలని ఎండోక్రినాలజిస్టులు సూచిస్తున్నారు. ✍️ మరింత ఉమెన్, చైల్డ్ కేర్ కంటెంట్ కోసం <<-se_10014>>వసుధ<<>> కేటగిరీకి వెళ్లండి.

News November 11, 2025

ఆత్మాహుతి దాడి వెనుక జైష్-ఇ-మహమ్మద్!

image

ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన బాంబ్ బ్లాస్ట్ ఆత్మాహుతి దాడేనని కేసు దర్యాప్తు చేస్తున్న ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించాయి. దీని వెనుక జైష్-ఇ-మహమ్మద్ ఉన్నట్లు తెలిపాయి. దేశ రాజధాని నడిబొడ్డున కూడా దాడిచేసే సామర్థ్యం తమకు ఉందని చెప్పేందుకే ఎర్రకోటను ఎంచుకున్నట్లు పేర్కొన్నాయి. కాగా ఈ కేసు విచారణను కేంద్రం ఎన్ఐఏకు అప్పగించిన విషయం తెలిసిందే.