News July 27, 2024

సుంకేసుల బ్యారేజ్ రెండు గేట్లు ఎత్తివేత

image

గద్వాల జిల్లా రాజోలి మండల కేంద్ర సమీపంలో ఉన్న సుంకేసుల బ్యారేజ్ 2 గేట్లు శుక్రవారం సాయంత్రం ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. బ్యారేజీ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 292 మీటర్లు ఉండగా ప్రస్తుతం 289.70 మీటర్లుగా ఉంది. రెండు గేట్ల ద్వారా 7286 క్యూసెక్కులు, కేసీ కెనాల్‌కు 1.540 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. రేపటికి వరద పెరిగితే మరిన్ని గేట్లు తెరిచే అవకాశం ఉంది.

Similar News

News August 5, 2025

MBNR: ఆగస్టు 15 వేడుకలను ఘనంగా నిర్వహించాలి: కలెక్టర్

image

ఆగస్టు 15 వేడుకలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవానికి సంబంధించి వివిధ శాఖల అధికారులతో మంగళవారం ఆమె సమావేశం అయ్యారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలోని పరేడ్ గ్రౌండ్‌లో వేదిక వీఐపీలు, అధికారులు, మీడియా ఇతరులకు సీటింగ్ ఏర్పాటు చేయాలని అన్నారు. పెరేడ్ మైదానంలో తాగునీరు, మౌలిక వసతులు ఏర్పాటు చేయాలన్నారు.

News August 5, 2025

PU ఇంజినీరింగ్ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్‌గా మొహియుద్దీన్

image

పాలమూరు యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్‌గా డాక్టర్ గౌస్ మొహియుద్దీన్ నియమితులయ్యారు. ఈ మేరకు నియామక పత్రాన్ని పాలమూరు యూనివర్సిటీ ఉపసంచాలకులు ఆచార్య జి.ఎన్.శ్రీనివాస్ మంగళవారం అందజేశారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని ఈ సందర్భంగా వైస్ ప్రిన్సిపల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలమూరు యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య పూస రమేశ్ బాబు తదితరులు పాల్గొన్నారు.

News August 5, 2025

పీయూ అకాడమిక్ ఆడిట్ సెల్ కో-ఆర్డినేటర్‌గా రవికుమార్

image

పాలమూరు యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ విభాగానికి చెందిన డాక్టర్ రవికుమార్‌ను అకాడమిక్ ఆడిట్ సెల్ కోఆర్డినేటర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఉపకులపతి ఆచార్య జీఎన్ శ్రీనివాస్, రిజిస్ట్రార్ ఆచార్యపూస రమేశ్ బాబు, అకాడమీ ఆడిట్ సెల్ డైరెక్టర్ చంద్ర కిరణ్ నియామక పత్రాన్ని అందజేశారు. ప్రిన్సిపల్స్ డాక్టర్ మధుసూదన్ రెడ్డి, డాక్టర్ రవికాంత్, డాక్టర్ కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు.