News July 27, 2024
ధవళేశ్వరం: 12.49 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి

ధవళేశ్వరం బ్యారేజీ వద్ద శనివారం ఉదయం 7 గంటల వరకు 13.60 అడుగులతో గోదావరి నీటిమట్టం నిలకడగా ఉందని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజీ నుంచి 12.49 లక్షల క్యూసెక్కుల నీరు సముద్ర జలాల్లోకి వదులుతున్నారు. మూడు పంట కాలువల ద్వారా 5900 క్యూసెక్కుల నీటిని పంట సాగుకు విడుదల చేస్తున్నారు.
Similar News
News October 26, 2025
అక్టోబర్ 27న పీజీఆర్ఎస్ రద్దు: కలెక్టర్

వాతావరణ పరిస్థితుల కారణంగా అక్టోబర్ 27న నిర్వహించాల్సిన పీజీఆర్ఎస్ (ప్రజా గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) సమావేశాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ప్రకటించారు. ప్రజలు తమ ఫిర్యాదులు సమర్పించడానికి కలెక్టరేట్కు నేరుగా రావాల్సిన అవసరం లేదని తెలిపారు. టోల్ఫ్రీ నంబర్ 1100కు కాల్ చేయవచ్చని లేదా మీ కోసమే వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో తమ అర్జీలను నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ సూచించారు.
News October 25, 2025
సోమ, మంగళవారాల్లో పాఠశాలలకు సెలవు: కలెక్టర్

భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలోని పాఠశాలలకు సోమ, మంగళవారాల్లో సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం తెలిపారు. సోమవారం రోజున నిర్వహించవలసిన ‘పీజీఆర్ఎస్ – మీ కోసం’ కార్యక్రమాన్ని కూడా రద్దు చేసినట్లు ఆమె వెల్లడించారు. ఇంటర్మీడియట్ కళాశాలల నిర్వహణపై స్థానిక పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.
News October 25, 2025
అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

వర్షాలు–సైక్లోన్ హెచ్చరికల దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. శనివారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద అధికారులతో ఆమె సమావేశం నిర్వహించి, తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్తలపై దిశా నిర్దేశం చేశారు. మండలాధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని, ముందస్తు చర్యలు తప్పనిసరన్నారు. ప్రతి శాఖ సమన్వయంతో ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు.


