News July 27, 2024
గత ఐదేళ్లలో విదేశాల్లో చనిపోయిన విద్యార్థుల సంఖ్య ఎంతంటే?

గత ఐదేళ్లలో 633 మంది విద్యార్థులు విదేశాల్లో చనిపోయినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. పార్లమెంటు సమావేశాల్లో కేరళ ఎంపీ కొడికున్నిల్ సురేశ్ అడిగిన ప్రశ్నకు మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ సమాధానమిచ్చారు. అత్యధికంగా కెనడా(172), యూఎస్(108)లో చనిపోయారని పేర్కొన్నారు. పలు హింసాత్మక ఘటనల్లో 19 మంది కన్నుమూసినట్లు తెలిపారు. అవాంఛనీయ ఘటనల్లో ఆతిథ్య దేశాలు దర్యాప్తు చేసి బాధ్యులను శిక్షిస్తున్నాయన్నారు.
Similar News
News November 12, 2025
NIA, ఐబీ చీఫ్లతో అమిత్ షా భేటీ

ఢిల్లీ పేలుడుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉన్నతాధికారులతో మరోసారి కీలక భేటీ నిర్వహిస్తున్నారు. ఎన్ఐఏ, ఐబీ చీఫ్లతో తన కార్యాలయంలో సమావేశం అయ్యారు. బ్లాస్ట్ దర్యాప్తుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సాయంత్రం మరోసారి భేటీ కానున్నట్లు సమాచారం. అటు ఫరీదాబాద్-ఢిల్లీ బ్లాస్ట్ లింక్పై NIA ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. ఇప్పటివరకు 9 మందిని అరెస్ట్ చేసింది.
News November 12, 2025
స్లీపర్ సెల్స్ రూపంలో టెర్రరిజం: కిరణ్ బేడీ

పేదరికం, నిరుద్యోగంతో యువత ఉగ్ర, తీవ్రవాదాల వైపు మళ్లుతున్నారన్నది పాత వాదన. కానీ అదిప్పుడు వైట్ కాలర్ అఫెన్సుగా మారింది. తాజాగా పట్టుబడ్డవారంతా డాక్టర్లు, ప్రొఫెసర్లే. సరిహద్దుల్ని దాటి దేశంలో స్లీపర్ సెల్స్ రూపంలో టెర్రరిజమ్ వ్యాపించిందని మాజీ IPS కిరణ్ బేడీ ఇండియాటుడే చర్చలో పేర్కొన్నారు. ఇది ప్రమాదకరమని, ప్రజల సహకారంతో అన్ని రాష్ట్రాల భద్రతా విభాగాలు ఉగ్రవాదాన్ని పూర్తిగా తుదముట్టించాలన్నారు.
News November 12, 2025
‘తడిసిన ధాన్యం కొనుగోలుకు నిబంధనలు సవరించేలా చూడండి’

AP: మొంథా తుఫాన్ నష్టంపై వేగంగా నివేదిక ఇచ్చి.. రాష్ట్రాన్ని ఉదారంగా ఆదుకోవాలని కేంద్ర బృందాన్ని సీఎం చంద్రబాబు కోరారు. తుఫాన్ వల్ల రూ.6,384 కోట్ల నష్టం వాటిల్లిందని, తక్షణ సాయంగా రూ.2,622 కోట్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్రం బృందం CMతో సమావేశమైంది. తడిసిన ధాన్యం కొనుగోలుకు నిబంధనలు సవరించేలా కేంద్రానికి సిఫార్సు చేయాలని బృంద సభ్యులను సీఎం కోరారు.


