News July 27, 2024

భద్రాచలం: 52 అడుగులకు గోదావరి

image

భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుత నీటిమట్టం 52.1 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం 12.50 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వెళ్తోంది.

Similar News

News February 4, 2026

అపోహలు వీడండి.. ఆరోగ్యం కాపాడుకోండి!

image

ప్రారంభ దశలోనే గుర్తిస్తే 90% క్యాన్సర్లను విజయవంతంగా నయం చేయవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. పీచు పదార్థాలు తింటూ రోజూ వ్యాయామం చేస్తే వ్యాధి ముప్పు తగ్గుతుందంటున్నారు. ‘శరీరంలో గడ్డలు, మచ్చలు, దీర్ఘకాలిక మార్పులు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. ప్రాథమిక దశలో వ్యాధి నిర్ధారణే మన ప్రాణాలను కాపాడుతుంది’ అని సూచిస్తున్నారు. నేడు వరల్డ్ క్యాన్సర్ డే.

News February 4, 2026

నేను BRS ఎమ్మెల్యేనే.. కాంగ్రెస్‌తో పనిచేస్తున్నా: సంజయ్

image

TG: తాను BRS టికెట్‌పై గెలిచానని, ఆ పార్టీలోనే ఉన్నానని జగిత్యాల MLA సంజయ్ వెల్లడించారు. ప్రతినెలా తన జీతం నుంచి బీఆర్ఎస్‌కు రూ.5వేలు వెళ్తున్నాయన్నారు. కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ బిల్లులు ప్రవేశపెట్టి విప్ జారీ చేస్తే తాను మద్దతిస్తానని చెప్పారు. కాగా ఫిరాయింపుల కేసులో సంజయ్‌కు స్పీకర్ <<19046638>>క్లీన్‌చిట్<<>> ఇచ్చిన విషయం తెలిసిందే.

News February 4, 2026

ఎమ్మెల్యే సంజయ్‌పై అనర్హత పిటిషన్ కొట్టివేత

image

TG: ఫిరాయింపుల కేసులో మరో ఎమ్మెల్యేకు క్లీన్ చిట్ లభించింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌పై అనర్హత పిటిషన్‌ను స్పీకర్ గడ్డం ప్రసాద్ కొట్టివేశారు. ఆయన పార్టీ మారినట్లు ఆధారాలు లేవని స్పీకర్ స్పష్టం చేశారు. ఇప్పటికే పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్య, తెల్లం వెంకట్రావు, కృష్ణమోహన్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్‌ల అనర్హత పిటిషన్లనూ కొట్టేసిన విషయం తెలిసిందే.