News July 28, 2024
నేడు ఉమ్మడి తూ.గో జిల్లాలో మంత్రి అచ్చెన్న పర్యటన

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదివారం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పలు మండలాల్లో పర్యటిస్తారని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మంత్రి పర్యటన మొదలవుతుందన్నారు. ఉండ్రాజవరం, నిడదవోలు, రామచంద్రపురం, కె.గంగవరం, సీతానగరం మండలాల్లోని గోదావరి వరద ముంపు ప్రాంతాలను పరిశీలిస్తారని పేర్కొన్నారు. నష్టపోయిన పంటల వివరాలు, బాధితుల కష్టాలు తెలుసుకోనున్నారు.
Similar News
News August 27, 2025
రాజమండ్రి: బార్ లైసెన్సుల కోసం స్పందన అంతంత మాత్రమే

తూ.గో బార్లకు దరఖాస్తులదారుల నుంచి స్పందన కరువైంది. జిల్లాలో మరో 22 బార్ల లైసెన్సుల కోసం దరఖాస్తులు కోరగా.. మంగళవారం గడువు ముగిసే నాటికి రాజమండ్రి నుంచి 4, ఇతర ప్రాంతాల నుంచి మరో 4 దరఖాస్తులు మాత్రమే ఎక్సైజ్ శాఖకు అందాయి. వైన్ షాపుల వద్ద పర్మిట్ రూములు, అధిక లైసెన్స్ ఫీజులు, ఇతర కారణాలతో లైసెన్సుల కోసం వెనకడుగు వేస్తున్నారని తెలుస్తోంది. కాగా దరఖాస్తుల స్వీకరణ గడువును ఈ నెల 29 వరకు పెంచారు.
News August 27, 2025
రాజమండ్రి: కలువ పువ్వుల కోసం కాలువలోకి దిగి వ్యక్తి మృతి

కొంతమూరు గ్రామానికి చెందిన వంక త్రిమూర్తులు అనే వ్యక్తి కాలువలోకి దిగి కలువ పువ్వులు కోస్తుండగా ప్రమాదవశాత్తూ మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. మంగళవారం సాయంత్రం త్రిమూర్తులు అనే వ్యక్తి వినాయక చవితి సందర్భంగా కలువ పువ్వులు కోసం కాలువలోకి దిగాడు. కాలు జారి పడటంతో మునిగిపోయి మృతి చెందాడు. స్థానికులు సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు.
News August 27, 2025
ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోండి: ఎస్పీ

వినాయక చవితి వేడుకలు, నిమజ్జన కార్యక్రమాలలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని ఎస్పీ డి.నరసింహ కిషోర్ అన్నారు. మంగళవారం రాత్రి జిల్లా ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా పోలీసు వారికి ప్రజలు సహకరించాలని, పర్యావరణాన్ని కాపాడేందుకుగాను మట్టి ప్రతిమలను వినియోగించాలన్నారు.