News July 28, 2024

వివాదం: కేరళ బ్యాంకు నివాళుల జాబితాలో ముషారఫ్‌ పేరు

image

కేరళలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా అలప్పుళ శాఖ చేసిన ఓ పని కలకలం రేపింది. ఓ కార్యక్రమంలో నివాళులర్పించేందుకు సిద్ధం చేసిన ప్రముఖుల జాబితాలో పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ పేరును చేర్చింది. 25వ కార్గిల్ విజయ దివస్ జరిగిన మరుసటి రోజే.. ఆ యుద్ధానికి కారణమైన ముషారఫ్‌ పేరును లిస్టులో పెట్టడం గమనార్హం. అనుకోకుండా జరిగిందంటూ బ్యాంకు ఓ ప్రకటనలో క్షమాపణలు చెప్పింది. దీనిపై బీజేపీ అలప్పుళలో నిరసన వ్యక్తం చేసింది.

Similar News

News November 15, 2025

DRDOలో 18 అప్రెంటిస్‌లు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

image

<>DRDO<<>> అనుబంధ సంస్థ డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయో ఎనర్జీ రీసెర్చ్ సెంటర్, హల్ద్వానీలో 18 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. 18ఏళ్లు నిండిన ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు ముందుగా www.apprenticeshipindia.gov.in రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వెబ్‌సైట్: https://www.drdo.gov.in/

News November 15, 2025

రెండు చోట్ల ఓడిన బిహార్ ‘సింగం’

image

నిన్న వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బిహార్ ‘సింగం’గా పిలవబడే మాజీ ఐపీఎస్ శివ్‌దీప్ లాండే ఓటమిపాలయ్యారు. అరారియా, జమాల్‌పూర్‌ నియోజకవర్గాల నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. జమాల్‌పూర్‌లో జేడీయూ నేత నచికేత మండల్ 96,683 ఓట్లతో, అరారియాలో కాంగ్రెస్ అభ్యర్థి అబిదుర్ రెహ్మాన్ 91,529 ఓట్లతో విజయం సాధించారు. లాండేకు ప్రజాదరణ ఉన్నప్పటికీ దానిని ఓట్లుగా మార్చుకునే ప్రయత్నంలో విఫలమయ్యారు.

News November 15, 2025

నిర్మాణాత్మక సంస్కరణలకు సిద్ధం: మంత్రి లోకేశ్

image

AP: ఏఐ మానవాళికి ముప్పుకాదని, అది హ్యుమానిటీని పెంచుతుందని మంత్రి లోకేశ్ చెప్పారు. CII సదస్సులో ‘AI-భవిష్యత్తులో ఉద్యోగాలు’ అంశంపై ఆయన మాట్లాడారు. ‘ప్రతి పారిశ్రామిక విప్లవం అధిక ఉద్యోగాలను కల్పిస్తుందికానీ తొలగించదు. IT, ఫుడ్ ప్రాసెసింగ్‌లో పారిశ్రామికవేత్తలు పురోగతి సాధిస్తున్నారు. వీరితో పనిచేసేందుకు ప్రభుత్వం ఉత్సాహంగా ఉంది. నిర్మాణాత్మక సంస్కరణలు తెచ్చేందుకు సిద్ధం’ అని పేర్కొన్నారు.