News July 28, 2024
తాడేపల్లిగూడెం: యాక్సిడెంట్.. UPDATE

తాడేపల్లిగూడెం మండలం ఆరుళ్ల వద్ద జరిగిన <<13724153>>రోడ్డు ప్రమాదం<<>>లో ఓ మహిళ మృతిచెందిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల ప్రకారం.. భీమవరానికి చెందిన పీతల నాగమణి (62) కూతురు విశాలితో కలిసి కారులో నిడదవోలులో ఓ ఫంక్షన్ అటెండ్ అయ్యేందుకు బయలుదేరారు. ఈ క్రమంలో ఆరుళ్ల వద్ద ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి చెట్టును ఢీకొన్నారు. నాగమణి మృతిచెందగా విశాలికి స్వల్ప గాయాలయ్యాయి. రూరల్ పోలీసులు దర్యాప్తుచేస్తున్నారు.
Similar News
News February 27, 2026
నిజం దాగదు.. RRRపై ఐపీఎస్ సంచలన పోస్ట్

డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ ‘ఎక్స్’ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. “సాధారణంగా పడిపోతేనే రెండు చోట్ల ఎముకలు విరిగాయి.. మరి కస్టడీలో అంత దారుణంగా కొట్టి ఉంటే ఎన్ని ఫ్రాక్చర్లు ఉండాలి?” అని ప్రశ్నించారు. అబద్ధాలు బయటపడుతున్నాయని, నిజం ఎప్పటికీ దాగదని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
News February 27, 2026
రఘురామకృష్ణరాజుకు విజయవంతంగా శస్త్రచికిత్స

డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజుకు హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో గురువారం శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. విజయవాడలో జరిగిన శాసనసభ్యుల ఆటవిడుపు క్రీడల్లో భాగంగా క్రికెట్ ఆడుతుండగా, పరుగు కోసం ప్రయత్నించి ఆయన కింద పడిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆయన మణికట్టు ఎముక విరగడంతో వైద్యులు ఆపరేషన్ నిర్వహించారు. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
News February 27, 2026
భీమవరం: కల్తీ రాయుళ్లకు కలెక్టర్ వార్నింగ్

జిల్లాలో కల్తీ ఆహార పదార్థాల విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ చదలవాడ నాగరాణి హెచ్చరించారు. గత 2రోజులుగా జిల్లావ్యాప్తంగా పాల కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భీమవరంలో జరిగిన తనిఖీల్లో పట్టుబడిన కల్తీ పాల పదార్థాలను మున్సిపల్ కార్యాలయం వద్ద కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ప్రజారోగ్యంతో చెలగాటమాడే ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చిరంచారు.


