News July 28, 2024
VZM: జిల్లాకు 480 మెట్రిక్ టన్నుల డీఏపీ

ఖరీఫ్ సీజన్లో రైతులకు పంపిణీ చేసే నిమిత్తం 480 మెట్రిక్ టన్నుల డీఏపీ ఎరువులతో కూడిన గూడ్సు రైలు వ్యాగన్ క్రిభ్కో కంపెనీ నుంచి జిల్లాకు చేరుకున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి వి.టి.రామారావు ఆదివారం తెలిపారు. ఈ ఎరువులను ఇప్పటికే జిల్లాలోని 38 రైతుసేవా కేంద్రాలకు సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.
Similar News
News July 6, 2025
భీమా సౌకర్యాలను ప్రజలు వినియోగించుకోవాలి: కలెక్టర్

పీఎం జీవన జ్యోతి, సురక్ష భీమా యోజన, అటల్ పెన్షన్ యోజన పధకాల ద్వారా భీమా పొందాలని కలెక్టర్ అంబేద్కర్ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. అతి తక్కువ ప్రీమియంతోనే ఎక్కువ రక్షణ పొందవచ్చన్నారు. భీమా పథకాలపై సచివాలయాల స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. సామాన్య కుటుంబాలకు ఎంతో ప్రయోజనం ఉంటుందని చెప్పారు.
News July 6, 2025
VZM: 2,232 పాఠశాలు.. 2,10,377 మంది విద్యార్థులు

ఈనెల 10న జిల్లాలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా.బి.ఆర్.అంబేడ్కర్ శనివారం తెలిపారు. గత ఏడాది కేవలం ప్రభుత్వ పాఠశాలలలోనే నిర్వహించామన్నారు. ఈ ఏడాది ప్రైవేటు పాఠశాలల్లో కూడా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. జిల్లా వ్యాప్తంగా 2,232 పాఠశాల నుంచి 2,10,377 మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలసి హాజరు కానున్నారని తెలిపారు.
News July 6, 2025
ఉమ్మడి జిల్లాలో విజయవంతంగా జాతీయ లోక్ అదాలత్

ఉమ్మడి జిల్లాలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం శనివారం విజయవంతంగా ముగిసింది. విజయనగరంలో 473, పార్వతీపురంలో 119, బొబ్బిలి 69, సాలూరులో 229, శృంగవరపుకోటలో 47, గజపతినగరంలో 347, చీపురుపల్లిలో 38, కొత్తవలసలో 320, కురుపాంలో 14 కేసులు పరిష్కరించామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత తెలిపారు. విజయవంతం చేసిన సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు.