News July 28, 2024
పొదలకూరు పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట

తమకు ప్రాణహాని ఉందని మమ్మల్ని రక్షించాలంటూ ఓ ప్రేమజంట పొదలకూరు పోలీసులను ఆశ్రయించింది. ప్రేమికులు దిండు మనోజ్, పులి మాధురి మాట్లాడుతూ.. పదేళ్లుగా ప్రేమించుకొని గూడూరులోని నరసింహస్వామి దేవస్థానంలో పెళ్లి చేసుకున్నామన్నారు. తమ తల్లిదండ్రులు ఏ క్షణంలోనైనా దాడి చేసి హత్య చేస్తారన్న భయంతో పోలీసు స్టేషన్ను ఆశ్రయించామన్నారు. ఎస్పీ జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలని ప్రేమ జంట కోరింది.
Similar News
News February 28, 2026
శ్రీసిటీలో భారీ స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు

శ్రీసిటీకి మరో భారీ పరిశ్రమ రానుంది. జపాన్కు చెందిన ప్రొటీరియల్ లిమిటెడ్ సంస్థ రూ.700కోట్లతో ఎలక్ట్రికల్ స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయనుంది. దేశంలోనే తొలిసారి బొగ్గుతో కాకుండా మొత్తం విద్యుత్తు ద్వారా ఎల్లాయ్ రిబ్బన్ను ఉత్పత్తి చేయనుంది. రెండో దశలో మరో రూ.700కోట్లు పెట్టనుంది. ముందుగా 200 మందికి.. తర్వాత 500మందికి ఉద్యోగాలు కల్పిస్తారు. ఈ ఏడాది చివరిలో కంపెనీ కార్యకలాపాలు ప్రారంభం అవుతాయి.
News February 28, 2026
అన్నదాతకు రూ.25 వేల మద్దతు ధర వచ్చేనా.?

వరికి ఒక క్వింటా ₹2389 లెక్కన పుట్టి ధర ₹21330 వరకు A- గ్రేడ్ రకానికి ఇస్తుండగా సాధారణ రకానికి పుట్టి ధర ₹20,136 చొప్పున నిర్ణయించారు. అయితే కేంద్రాల్లో ధాన్యం విక్రాయించాలంటే తరుగులతో కొంత తీసేస్తుండగా గొనె సంచులు, రవాణా ఖర్చులు రైతులే భరించాల్సి ఉంది. దీంతో ఎకరాకు రూ.35-40 వేల వరకు ఖర్చు అవుతుండగా రైతుకు రూ.20 వేలు కూడా మిగలడం లేదు. ప్రభుత్వం పుట్టికి రూ.25 వేల మద్దతు ధర ఇవ్వాలని రైతులు కోరారు.
News February 28, 2026
నెల్లూరు: 3.45 లక్షల ఎకరాల్లో వరిసాగు.!

ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు మద్దతు ధరలు దక్కడం లేదు. జిల్లాలో ఈ ఏడాది రబీలో 3.45 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగింది. దాదాపు 10 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం దిగుబడి రానుంది. వచ్చే నెల నుంచి జిల్లాలో 161 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుండగా.. 5 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.


