News July 28, 2024
భారత్ టార్గెట్ 162 రన్స్

భారత్తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్లో శ్రీలంక 9 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. కుశాల్ పెరీరా 53, నిస్సంక 32, మెండిస్ 26 పరుగులు చేశారు. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్ 3, అర్షదీప్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్య తలో రెండు వికెట్లు తీశారు. భారత్ టార్గెట్ 162 పరుగులు.
Similar News
News January 12, 2026
వచ్చే వారం ఇన్వెస్టర్ల ముందుకు ఆరు IPOలు

ఈ నెల 12 నుంచి 16 వరకు మార్కెట్కు ఆరు IPOలు రానున్నాయి. వీటిలో అమాగీ మీడియా ల్యాబ్స్ ఒక్కటే మెయిన్ బోర్డ్ ఐపీఓ కాగా, మిగతా ఐదు ఎస్ఎంఈ (Small and Medium Enterprises) విభాగానికి చెందినవే. అమాగీ ఐపీఓ జనవరి 13న ప్రారంభమై 16న ముగియనుంది. షేరు ధర రూ.343-361 మధ్య ఉండగా రూ.1,789 కోట్లు సమీకరించనుంది. ఇదిలా ఉండగా శుక్రవారం పబ్లిక్ ఇష్యూకు వచ్చిన భారత్ కోకింగ్ కోల్ ఐపీఓకు భారీ స్పందన లభిస్తోంది.
News January 12, 2026
శాస్త్రం చూసి మరీ కోడి పందేలు.. ఎందుకంటే?

గోదావరి జిల్లాల్లో కోడి పందేలకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ పందెంలో గెలవడానికి పుంజుకి సత్తా ఉంటే సరిపోదట, గ్రహాలు కూడా అనుకూలించాలట. ఈ విషయాలు తెలుసుకోవడానికి ఓ గ్రంథమే అందుబాటులో ఉంది. అదే ‘కుక్కుట శాస్త్రం’. పందెం రాయుళ్లు కోడి పందేల సమయంలో ఈ గ్రంథంపైనే ఆధారపడతారట. అసలు ఈ గ్రంథంలో ఏముంటుంది? పందెం కోళ్ల విజయాలపై ఈ గ్రంథం ఏం చెబుతుందో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట క్లిక్<<>> చేయండి.
News January 12, 2026
DRDO-SSPLలో ఇంటర్న్షిప్.. అప్లై చేశారా?

<


