News July 29, 2024

దువ్వూరు: చల్లబసాయపల్లె డ్యామ్‌లో ముగ్గురు గల్లంతు

image

కడప జిల్లా దువ్వూరు మండలంలోని చల్లబాసాయపల్లె సమీపంలోని తెలుగు గంగ ప్రాజెక్టు అంతర్భాగమైన సబ్సిడీ రిజర్వాయర్-1లో ముగ్గురు గల్లంతయ్యారు. ఆదివారం విహారయాత్ర కోసం వెళ్లిన ప్రొద్దుటూరుకు చెందిన ముగ్గురు వ్యక్తులు డ్యామ్‌లో ఈత కొడుతుండగా గల్లంతైనట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News December 28, 2025

ప్రొద్దుటూరు: ‘నిర్మాణాలు పూర్తి కాకుండానే బిల్లుల చెల్లింపు’

image

PDTR పేజ్-3 ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాకుండానే బిల్లులు చెల్లించారు.
*JNR రూ.2.67కోట్లు, పోండ్ల శివశంకర్ రూ.24.79 లక్షలు
*వాసవి ఇన్‌ఫ్రా రూ.31.73 కోట్లు, వినాయక రూ.2.40 కోట్లు
*వెంకటేశ్వర రూ.10.04 కోట్లు, సిరి ఫ్లైయాష్ రూ.1.66 కోట్లు
*తబాసుమ్ బిల్డర్స్ రూ.72.01 లక్షలు, గుర్రం రవి రూ.3.28 కోట్లు
*ఉప్పలపాటి కనకరాజు రూ.38.51లక్షలు, కృష్ణమ్మ రూ.4 కోట్లు
*రవిప్రకాష్ రూ.65 లక్షలు చెల్లింపులు చేశారు.

News December 28, 2025

2025లో కడప జిల్లాలో సంచలన ఘటనలు ఇవే.!

image

▶ విషాదం నింపిన మే నెల.. మే 23న మైలవరం మండలంలో 3ఏళ్ల చిన్నారిపై హత్యాచారం. నిందితుడి ఆత్మహత్య
▶ మే 13న బ్రహ్మంగారిమఠం (M) మల్లెపల్లెలో ఈతకు వెళ్లి ఐదుగురు చిన్నారులు మృతి
▶ మే 24న గువ్వలచెరువు ఘాట్ రోడ్డులో లారీ అదుపుతప్పి కారుపై పడటంతో ఐదుగురు మృతి
▶ జులైలో గండికోటలో బాలిక హత్య.. ఇంకా కొలిక్కి రాని కేసు
▶ అక్టోబర్ 5న ప్రొద్దుటూరులో తల్లిని చంపిన కొడుకు
▶ అక్టోబర్ 26న జమ్మలమడుగులో జంట హత్యలు.

News December 28, 2025

2025లో కడప జిల్లాలో జరిగిన రాజకీయ పరిణామాలు ఇవే.!

image

☛ ఉద్రిక్తతల నడుమ గోపవరం ఉప సర్పంచ్ ఉప ఎన్నికలో YCP విజయం
☛ పులివెందుల, ఒంటిమిట్ట ZPTC ఉప ఎన్నికలో TDP విజయం
☛ కూటమి నేతలకు పదవులు
☛ కడప మేయర్‌గా సురేశ్ బాబు తొలగింపు.. తర్వాతి ఎన్నికలో పాక సురేశ్ ఎన్నిక
☛ కడప జిల్లా TDP అధ్యక్షుడిగా భూపేశ్ రెడ్డి నియామకం
☛ కడప జిల్లాలో మహానాడు నిర్వహణ
☛ జమ్మలమడుగు YCP ఇన్‌ఛార్జ్‌గా రామసుబ్బారెడ్డి నియామకం
☛ ప్రొద్దుటూరు ఎగ్జిబిషన్ బకాయిలపై దీక్షలు.