News July 29, 2024
మలద్వారంలో దాచిన బంగారం.. ఈ వార్తలకు చెక్ పడ్డట్టే!

మలద్వారంలో దాచిన బంగారం కడ్డీలను పట్టేసిన అధికారులు… ఇకపై ఇలాంటి న్యూస్ రాకపోవచ్చు. కస్టమ్స్ సుంకం 6 శాతానికి తగ్గడంతో స్మగ్లింగ్ తగ్గిపోతుందని ఇండస్ట్రీ వర్గాల అంచనా. ధర తక్కువని దుబాయ్, UAE నుంచి కొందరు గోల్డ్ అక్రమ రవాణాకు ప్రయత్నించేవాళ్లు. చివరికి విమాన, నౌకాశ్రయాల్లో కస్టమ్స్ అధికారులకు చిక్కేవాళ్లు. ఇప్పుడు భారత్లోనే ధర తగ్గడంతో ఈ ఘటనలు ఆగిపోవచ్చు. కస్టమ్స్ వారికీ శ్రమ తగ్గొచ్చు.
Similar News
News November 14, 2025
కౌంటింగ్ షురూ..

బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ బైఎలక్షన్ కౌంటింగ్ ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తున్నారు. జూబ్లీహిల్స్లో 2, 3 గంటల్లో ఫలితాల సరళి తెలియనుంది. 10 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి కానుంది. అటు బిహార్లో 2,616 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.
News November 14, 2025
ఈనెల 17న జాబ్ మేళా

AP: ఈనెల 17న పార్వతీపురం Employment Office ఆధ్వర్యంలో ఆన్లైన్ జాబ్ ఫెయిర్ నిర్వహించనున్నారు. 18ఏళ్లు పైబడిన టెన్త్, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఇందులో పాల్గొనవచ్చు. మొత్తం 1150 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ముందుగా https://rb.gy/68z9mn లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
News November 14, 2025
ఫాస్టాగ్ లేని వాహనదారులకు ఊరట

ఫాస్టాగ్ లేని వాహనదారులకు కేంద్రం ఊరటనిచ్చింది. సాధారణంగా నేషనల్ హైవేలపై ఫాస్టాగ్ లేకుంటే టోల్ ప్లాజాల వద్ద ఫీజు రెండింతలు చెల్లించాలి. ఇప్పుడు ఆ నిబంధనను మార్చారు. UPI ద్వారా చెల్లిస్తే అదనంగా 25% కడితే సరిపోతుంది. నగదు చెల్లింపులకు మాత్రం రెట్టింపు ఫీజు తీసుకుంటారు. డిజిటల్ పేమెంట్స్ ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. రేపు (నవంబర్ 15) తెల్లవారుజాము నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది.


