News July 29, 2024

ఉద్యోగులకు గుడ్‌న్యూస్

image

AP: సచివాలయం, హెచ్‌వోడీ కార్యాలయ ఉద్యోగులకు ఇంటి అద్దె భత్యం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 16 శాతంగా ఉన్న హెచ్ఆర్ఏను 24 శాతానికి పెంచింది. దీనిని రూ.25వేలకు మించకుండా వర్తింపజేయాలని నిర్ణయించింది.

Similar News

News April 3, 2026

సంజూ శాంసన్‌ను చూసి నేర్చుకోండి: మోదీ

image

కేరళం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భారత క్రికెటర్ సంజూ శాంసన్‌పై PM మోదీ ప్రశంసలు కురిపించారు. ‘WC నాకౌట్‌లో సంజూ చెలరేగి ఆడారు. అతడి ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం మరింత బలపడ్డాయి. ఇవి నిజమైన క్రీడాకారుడి లక్షణాలు. జట్టుకు అవసరమైనప్పుడల్లా గొప్ప ఆటగాడు రాణిస్తాడు. అలానే ఓటింగ్ రోజున BJP కార్యకర్తలు ప్రతి ఇంటినీ చేరుకోవాలి. మీ అంకితభావం అత్యంత ముఖ్యం. విజయం కోసం అదనంగా పని చేయాలి’ అని పిలుపునిచ్చారు.

News April 3, 2026

నిగనిగలాడే మామిడి పండ్లు కొంటున్నారా?

image

సమ్మర్‌ వచ్చేసింది.. రోడ్ల పక్కన నిగనిగలాడే మామిడి పండ్లు నోరూరిస్తున్నాయా? వాటిని తింటే మీరు అనారోగ్యం బారినపడే ప్రమాదం ఉంది. కొందరు కాల్షియం కార్బైడ్, ఇతర రసాయనాలు కలిపి మగ్గబెడుతున్నారు. వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని HYD CP సజ్జనార్ హెచ్చరించారు. సహజంగా పండిన పండు అంతా ఒకే రంగులో ఉండదని చెబుతున్నారు. కల్తీ మామిడి పండ్ల సమాచారం తెలిస్తే 100కు లేదా 8712661212 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు.

News April 3, 2026

రష్యా నుంచి 90% పెరిగిన ఆయిల్ దిగుమతులు

image

హార్ముజ్ సంక్షోభం నేపథ్యంలో రష్యా నుంచి ఇండియా ఆయిల్ దిగుమతులు భారీగా పెరిగాయి. ఫిబ్రవరితో పోలిస్తే మార్చిలో 90% అధికంగా చమురు వచ్చింది. అయినప్పటికీ దేశంలో మొత్తం ఇంపోర్ట్స్‌లో 15% తగ్గుదల నమోదైంది. గత నెలలో LPG దిగుమతులు 40% పడిపోగా, LNG రవాణా తగ్గిపోయింది. దీంతో ప్రత్యామ్నాయ వనరులపై భారత్ దృష్టిపెట్టింది. రష్యాతోపాటు అంగోలా, గాబన్, ఘనా, కాంగో తదితర దేశాల నుంచి క్రూడ్‌ను కొనుగోలు చేస్తోంది.