News July 29, 2024

ఒలింపిక్స్: సాత్విక్-చిరాగ్ రికార్డు

image

పారిస్ ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ మెన్స్ డబుల్స్‌లో సాత్విక్-చిరాగ్ క్వార్టర్స్‌కు చేరారు. దీంతో ఒలింపిక్స్ చరిత్రలో ఈ విభాగంలో క్వార్టర్ ఫైనల్‌కు చేరిన తొలి భారత జోడీగా రికార్డు సృష్టించారు. రేపు ఇండోనేషియాకు చెందిన అథ్లెట్లతో పోటీ పడనున్నారు. ఇండోనేషియా జోడీ చేతిలో ఫ్రాన్స్ పెయిర్ ఓడిపోవడంతో భారత జోడీకి క్వార్టర్స్‌ బెర్తు ఖరారైంది. <<-se>>#OLYMPICS2024<<>>

Similar News

News February 1, 2025

కాసేపట్లో మంత్రులతో CM అత్యవసర భేటీ

image

TG: సీఎం రేవంత్ కాసేపట్లో మంత్రులతో అత్యవసరంగా సమావేశం కానున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరగనున్న ఈ భేటీలో ఎమ్మెల్సీ, స్థానిక ఎన్నికలతో పాటు ప్రభుత్వ, పార్టీ అంతర్గత వ్యవహారాలు, తాజా రాజకీయాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అధికారులెవరూ ఈ మీటింగ్‌కు రావొద్దని ఆదేశించినట్లు సమాచారం.

News February 1, 2025

బడ్జెట్‌కు క్యాబినెట్ ఆమోదం

image

2025-26 బడ్జెట్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పార్లమెంటు భవనంలో సమావేశమైన క్యాబినెట్ పద్దుకు ఆమోదముద్ర వేసింది. ఉ.11 గంటలకు ఆర్థికమంత్రి నిర్మల బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఎన్డీయే మూడో టర్మ్‌లో ఇదే తొలి పూర్తిస్థాయి బడ్జెట్.

News February 1, 2025

రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ 60% పూర్తి

image

AP: రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ కొనసాగుతోంది. ఉ.10 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 60% పంపిణీ పూర్తయింది. ఉదయం పింఛన్ల పంపిణీ ప్రారంభించిన కాసేపటికే సర్వర్‌లో సమస్య తలెత్తడంతో కాసేపు ఇబ్బందులు ఎదురయ్యాయి. సమస్య పరిష్కారం అవడంతో ఎలాంటి అంతరాయం లేకుండా పెన్షన్లను అందజేస్తున్నారు. కాసేపట్లో అన్నమయ్య(D) మోటుకట్లలో సీఎం చంద్రబాబు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు.