News July 29, 2024
టెట్ దరఖాస్తు గడువుపై ఏపీ సర్కార్ క్లారిటీ

ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) దరఖాస్తు గడువు పొడిగించినట్లు సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మవద్దు అని ఏపీ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయ రామరాజు తెలిపారు. సోమవారం తాడేపల్లిలో వారు మాట్లాడుతూ.. ముందుగా ప్రకటించిన విధంగా ఆగస్టు 3 వరకే దరఖాస్తు గడువు తేదీ ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో గడువు పొడిగింపు తేదీ ఉండదని, అర్హత కలిగిన అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Similar News
News January 2, 2026
విజయవాడలో నేటి నుంచి బుక్ ఫెస్టివల్

విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జనవరి 2 నుంచి 12 వరకు 35వ పుస్తక ప్రదర్శన జరగనుంది. నేడు ప్రముఖుల సమక్షంలో ప్రారంభం కానున్న ఈ ప్రదర్శనలో 280కి పైగా స్టాల్స్ను ఏర్పాటు చేశారు. గత 25 ఏళ్లలో కథ, నవల, కవిత, నాటక రంగాల్లో వచ్చిన మార్పులపై ప్రముఖులు చర్చా వేదికల్లో ప్రసంగించనున్నారు. యువ రచయితల పుస్తకాలు ఈ ఏడాది ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
News January 2, 2026
రాజ ముద్రతో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ: కలెక్టర్

రాజ ముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభిస్తున్నామని కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. ఈ కార్యక్రమం జనవరి 9వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రజా ప్రతినిధులు హాజరై కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారని చెప్పారు. జిల్లాలో మొత్తం 35,690 పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేయడం జరుగుతుందని వివరించారు.
News January 2, 2026
రాజ ముద్రతో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ: కలెక్టర్

రాజ ముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభిస్తున్నామని కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. ఈ కార్యక్రమం జనవరి 9వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రజా ప్రతినిధులు హాజరై కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారని చెప్పారు. జిల్లాలో మొత్తం 35,690 పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేయడం జరుగుతుందని వివరించారు.


