News July 29, 2024
కేబినెట్ సమావేశం.. పాల్గొననున్న జిల్లా మంత్రులు

రాష్ట్ర కేబినెట్ సమావేశం ఆగస్టు 2న జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరగనున్న ఈ సమావేశంలో ఉమ్మడి కర్నూల్ జిల్లా మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్, ఫరూక్ పాల్గొననున్నారు. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారని సమాచారం.
Similar News
News January 9, 2026
రాష్ట్రంలోనే అత్యుత్తమ స్టేషన్గా పెద్దకడబూరు పీఎస్

పెద్దకడుబూరు పోలీస్స్టేషన్ రాష్ట్రంలోనే అత్యుత్తమ స్టేషన్గా ఎంపికైంది. శుక్రవారం మంగళగిరిలో డీజీపీ హారీశ్ కుమార్ గుప్తా నుంచి డీఐజీ విక్రాంత్ పాటిల్, డీఎస్పీ భార్గవి, ఎస్ఐ నిరంజన్ రెడ్డి ‘సర్టిఫికెట్ ఆఫ్ ఎక్సలెన్సీ’ అవార్డు అందుకున్నారు. నేర నియంత్రణ, సీసీ కెమెరాల ఏర్పాటు, కేసుల సత్వర పరిష్కారంలో చూపిన ప్రతిభకు కేంద్ర హోం శాఖ ఈ గుర్తింపునిచ్చింది. ఈ ఘనత జిల్లాకే గర్వకారణమని డీఐజీ పేర్కొన్నారు.
News January 9, 2026
అధిక చార్జీలు వసూలు చేస్తే చర్యలు: డీటీసీ

సంక్రాంతి పండుగ వేళ ప్రైవేటు బస్సుల్లో అధిక చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శాంత కుమారి హెచ్చరించారు. శుక్రవారం ఆమె బస్సు ఆపరేటర్లతో సమీక్ష నిర్వహించారు. ప్రతి బస్సులో హెల్ప్లైన్ నెంబర్ 9281607001 ప్రదర్శించాలని, రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ రెండో డ్రైవర్ను ఉంచుకోవాలని ఆమె ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై తనిఖీలు చేపడతామన్నారు.
News January 9, 2026
సచివాలయ సిబ్బందికి బయోమెట్రిక్ తప్పనిసరి: కలెక్టర్

గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ప్రతిరోజూ బయోమెట్రిక్ హాజరు తప్పనిసరిగా వేయాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదేశించారు. ఎంపీడీవోలు, సిబ్బందితో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్లో ఆమె మాట్లాడుతూ.. తక్కువ హాజరు శాతంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫీల్డ్కు వెళ్లే ముందే సచివాలయంలో హాజరు నమోదు చేయాలని స్పష్టం చేశారు. హాజరు ఉన్న రోజులకు మాత్రమే వేతనాలు చెల్లిస్తామని కలెక్టర్ హెచ్చరించారు.


