News July 29, 2024

BREAKING: కాకినాడలో యాక్సిడెంట్.. వ్యక్తి మృతి (VIDEO)

image

కాకినాడ భానుగుడి సెంటర్ నుంచి టూ టౌన్ వరకు గల రైల్వే ఫ్లైఓవర్‌పై సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. కాకినాడ డ్రైవర్స్ కాలనీకి చెందిన రెడ్డి చంద్రబోస్ (37) బైక్‌పై వెళ్తుండగా.. కాకినాడ నుంచి ఏలేశ్వరం వెళ్తున్న ఏలేశ్వరం డిపో బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందన్నారు.

Similar News

News August 27, 2025

రాజమండ్రి: బార్ లైసెన్సుల కోసం స్పందన అంతంత మాత్రమే

image

తూ.గో బార్లకు దరఖాస్తులదారుల నుంచి స్పందన కరువైంది. జిల్లాలో మరో 22 బార్ల లైసెన్సుల కోసం దరఖాస్తులు కోరగా.. మంగళవారం గడువు ముగిసే నాటికి రాజమండ్రి నుంచి 4, ఇతర ప్రాంతాల నుంచి మరో 4 దరఖాస్తులు మాత్రమే ఎక్సైజ్ శాఖకు అందాయి. వైన్ షాపుల వద్ద పర్మిట్ రూములు, అధిక లైసెన్స్ ఫీజులు, ఇతర కారణాలతో లైసెన్సుల కోసం వెనకడుగు వేస్తున్నారని తెలుస్తోంది. కాగా దరఖాస్తుల స్వీకరణ గడువును ఈ నెల 29 వరకు పెంచారు.

News August 27, 2025

రాజమండ్రి: కలువ పువ్వుల కోసం కాలువలోకి దిగి వ్యక్తి మృతి

image

కొంతమూరు గ్రామానికి చెందిన వంక త్రిమూర్తులు అనే వ్యక్తి కాలువలోకి దిగి కలువ పువ్వులు కోస్తుండగా ప్రమాదవశాత్తూ మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. మంగళవారం సాయంత్రం త్రిమూర్తులు అనే వ్యక్తి వినాయక చవితి సందర్భంగా కలువ పువ్వులు కోసం కాలువలోకి దిగాడు. కాలు జారి పడటంతో మునిగిపోయి మృతి చెందాడు. స్థానికులు సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు.

News August 27, 2025

ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోండి: ఎస్పీ

image

వినాయక చవితి వేడుకలు, నిమజ్జన కార్యక్రమాలలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని ఎస్పీ డి.నరసింహ కిషోర్ అన్నారు. మంగళవారం రాత్రి జిల్లా ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా పోలీసు వారికి ప్రజలు సహకరించాలని, పర్యావరణాన్ని కాపాడేందుకుగాను మట్టి ప్రతిమలను వినియోగించాలన్నారు.