News July 29, 2024

శ్రీకాకుళం జిల్లాలో TODAY TOP HEAD LINES

image

➤ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నంగా ఉంది: మంత్రి అచ్చెన్న➤ బడ్జెట్‌పై భయమెందుకు బాబు: ధర్మాన కృష్ణ దాస్➤ 1వ తేదీన పెన్షన్ల పంపిణీకి చర్యలు తీసుకోవాలి: కలెక్టర్➤ ఆగస్టు 3న రెండో విడత IIIT మెరిట్ జాబితా➤ APSRTCలో అప్రెంటిస్‌ల కోసం దరఖాస్తు➤ ఎస్పీ ప్రజా ఫిర్యాదుకు 58 ఫిర్యాదులు➤ సోంపేట టీడీపీ సీనియర్ నాయకుడు మృతి➤ గారలో సాగునీటి కోసం తోపులాట.. వృద్ధుడు మృతి

Similar News

News November 1, 2025

కాశీబుగ్గ ఆలయ తొక్కిలాట దుర్ఘటనపై అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి

image

కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి <<18167876>>ఆలయ తొక్కిలాట దుర్ఘటన<<>>పై మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనిపై దేవాలయ అధికారులతో మాట్లాడిన మంత్రి.. సంఘటన స్థలానికి బయల్దేరారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందచేయాలని అధికారులకు సూచించారు. మరోవైపు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాగా ఈ ఘటనలో 9 మంది మరణించినట్లు తెలుస్తోంది.

News November 1, 2025

ఘనంగా అరసవల్లి ఆదిత్యుని కళ్యాణం

image

అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో శనివారం స్వామివారి కళ్యాణం జరిగింది. కార్తీక శుద్ధ ఏకాదశి సందర్భంగా కళ్యాణం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ తెలిపారు. ఉదయం 8 గంటలకు అనివేటి మండపంలో వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ కళ్యాణం జరిగిందని ఆలయ డీసీ ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

News November 1, 2025

శ్రీకాకుళం జిల్లాలో కలకలం రేపుతున్న దొంగతనాలు

image

జిల్లాలో వరుస చోరీ ఘటనలు ప్రజలకు భయాందోళన కలిగిస్తున్నాయి. తూ.గో జిల్లా నుంచి వచ్చి ఇక్కడ చోరీలు చేస్తున్న ముగ్గురిని పోలీసులు ఇటీవల పట్టుకున్నారు. ఈ నెల 10న నరసన్నపేటలో ట్రాన్స్‌జెండర్లు చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. తాజాగా కాశీబుగ్గలో చోరీ, సారవకోట(M) బుడితిలో వృద్ధురాలి మెడలో బంగారం చోరీ చేశారు. ఇప్పటికే పదుల సంఖ్యలో కేసులున్న AP, ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఈ కేసుల్లో నిందితులుగా ఉన్నారు.