News July 29, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

@ పెద్దాపూర్ గురుకులం ఎదుట ఏబీవీపీ ధర్నా
@ ఓదెల మండల కేంద్రంలో నాగదేవత విగ్రహంపై నాగుపాము
@ కమాన్పూర్ మండలంలో కోడిపందాలు ఆడుతున్న ఏడుగురిపై కేసు
@ సిరిసిల్లలో భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న భర్త
@ ఎలిగేడు మండలంలో యువకుడి ఆత్మహత్య
@ ధర్మారం మండలంలో గుండెపోటుతో మహిళ మృతి
@ హుజూరాబాద్ మండలంలో తాటి చెట్టు పై నుంచి పడి గీత కార్మికుడికి గాయాలు
Similar News
News July 4, 2025
బహిరంగ ప్రదేశాల్లో నిషేధాజ్ఞలు: KNR సీపీ

సాధారణ పౌరులు, ప్రధానంగా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని KNR కమీషనరేట్ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై అమల్లో ఉన్న నిషేధాజ్ఞలను ఈ నెల 31 వరకు పొడిగించినట్లు KNR CP గౌస్ ఆలం ఒక ప్రకటనలో తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి ఘర్షనలకు పాల్పడుతున్న మందుబాబులపై పలు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈ చర్యలకు ఉపక్రమించినట్లు సీపీ పేర్కొన్నారు.
News July 4, 2025
KNR: కలెక్టరేట్లో ఘనంగా రోశయ్య జయంతి

ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య జయంతిని జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో రోశయ్య చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పూలమాలవేసి నివాళులు అర్పించారు. దేశ చరిత్రలో ఏడుసార్లు వరుసగా ఏపీ ఆర్థిక మంత్రి హోదాలో బడ్జెట్ ప్రవేశపెట్టిన రోశయ్య తమిళనాడు గవర్నర్ గా, ఏపీ సీఎంగా గొప్ప సేవలు అందించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.
News May 8, 2025
KNR-2 డిపోను సందర్శించిన జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్

KNR జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పగిడిమర్రి పోలమన్ KNR–2 డిపోను సందర్శించారు. డిపోలో ఎలక్ట్రికల్ బస్సులకు సంబంధించి ఏర్పాటు చేసిన మౌలిక వసతులు, ఛార్జింగ్ పాయింట్లు, వాటి మెంటేనెన్స్, ప్రాక్టీసెస్ గురించి వివరాలు తెలుసుకున్నారు. మెరుగైన సేవల కోసం తగు సలహాలు సూచనలు ఇచ్చారు. అనంతరం KNR బస్ స్టేషన్ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో KNR RM బి.రాజు, అధికారులు ఉన్నారు.