News July 30, 2024
‘అన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలి’

రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ డిమాండ్ చేశారు. సోమవారం చిలకలూరిపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం త్వరగా అమలు చేయాలన్నారు. అన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పిస్తేనే మహిళలకు పథకం వర్తిస్తుందన్నారు. ఎటువంటి ఆంక్షలు పెట్టకుండా పథకాన్ని అమలు చేయాలన్నారు.
Similar News
News January 4, 2026
తెనాలి: షార్ట్ ఫిల్మ్ పోటీలకు భారీ స్పందన

తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఈ నెల 11న నిర్వహించనున్న మా-ఏపీ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్కు అపూర్వ స్పందన లభించిందని దర్శకుడు దిలీప్ రాజ తెలిపారు. ఆదివారం తెనాలిలో ఆయన మాట్లాడుతూ.. వివిధ ప్రాంతాల నుంచి 203 లఘు చిత్రాలు పోటీకి వచ్చాయన్నారు. యువతలోని సృజనాత్మకతను వెలికితీసేందుకు ఈ వేదికను సిద్ధం చేశామన్నారు. ప్రతిభ కనబరిచిన విజేతలకు సినీ, కళారంగ ప్రముఖుల జ్ఞాపకార్థం నగదు బహుమతులు అందజేస్తామన్నారు.
News January 4, 2026
అమరావతి ఎఫెక్ట్.. VJA-GNTలో రియల్ బూమ్

రాజధాని అమరావతి పనులు వేగవంతం కావడంతో విజయవాడ-గుంటూరు మధ్య రియల్ ఎస్టేట్ మళ్లీ కళకళలాడుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక నిర్మాణ రంగానికి ఊపిరి వచ్చింది. కేవలం వారం రోజుల్లోనే ఈ కారిడార్లో 20కి పైగా కొత్త అపార్ట్మెంట్లకు భూమిపూజ జరిగింది. కాజ, మంగళగిరి, పెదకాకాని ప్రాంతాల్లో గేటెడ్ కమ్యూనిటీలకు భారీ డిమాండ్ ఏర్పడింది. సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ఇన్వెస్టర్లు ఇక్కడ పెట్టుబడులకు పోటీ పడుతున్నారు.
News January 4, 2026
మంగళగిరిలో యవకుల హల్చల్.. యువతి అపహరణ

మంగళగిరిలో ఇంట్లో ఉన్న ఓ ఇంటర్ విద్యార్థినిని (16) కొందరు యువకులు బలవంతంగా అపహరించుకుపోయిన ఘటన కలకలం రేపింది. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనపై బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులు ఇంట్లోకి చొరబడి విద్యార్థినిని లాక్కెళ్తుండగా, అడ్డువచ్చిన తమపై కూడా దౌర్జన్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, బాలిక ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.


