News July 30, 2024

₹185L crకు చేరనున్న కేంద్రం అప్పు

image

ఈ ఏడాది మార్చి నాటికి కేంద్రం అప్పు ₹171L cr అని కేంద్ర మంత్రి పంకజ్ చౌధరి వెల్లడించారు. ఇది జీడీపీలో 58.2 శాతానికి సమానమన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి జీడీపీ 3.57 ట్రిలియన్ డాలర్లకు చేరినట్లు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి కేంద్రం అప్పు ₹185L crకు చేరే అవకాశం ఉందని చెప్పారు.

Similar News

News November 15, 2025

అయ్యప్ప స్వాములకు తప్పక తెలియాల్సిన ప్రాంతం

image

అయ్యప్ప స్వామితో యుద్ధంలో మహిషి అనే రాక్షసి మొండెం పడిన ప్రదేశాన్ని ‘ఎరుమేలి’ అని అంటారు. దీన్నే ‘కొట్టబడి’ అని పిలుస్తారు. శబరిమల యాత్రలో ఎరుమేలికి చేరుకున్న భక్తులు ‘స్వామి దింతకతోమ్… అయ్యప్ప దింతకతోమ్’ అని ‘పేటత్తుళ్లి’ అనే సాంప్రదాయ నృత్యం చేస్తారు. ఇది మహిషిపై సాధించిన విజయాన్ని గుర్తుచేస్తుంది. ఎరుమేలి అయ్యప్ప భక్తులకు ఓ ముఖ్యమైన ఆరంభ స్థానంగా, పవిత్రమైన ప్రదేశంగా భావిస్తారు. <<-se>>#AyyappaMala<<>>

News November 15, 2025

179 పోస్టులకు నోటిఫికేషన్

image

సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ (<>CAU<<>>), ఇంఫాల్ 179 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు DEC 6వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో PhD, PG, NET ఉత్తీర్ణతతో పాటు బోధన/ రీసెర్చ్‌లో అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.1000, SC, ST, PWBD, మహిళలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://cau.ac.in/

News November 15, 2025

ఏపీ న్యూస్ రౌండప్

image

* విశాఖ CII సదస్సులో WEF సెంటర్‌ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్
* పరకామణి కేసు ఫిర్యాదుదారు సతీశ్ మృతిపై దర్యాప్తు ముమ్మరం.. అనంతపురం చేరుకున్న సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్
* గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా ఏపీ అవతరిస్తోందన్న మంత్రి గొట్టిపాటి
* చంద్రబాబుపై నమ్మకం లేక కంపెనీలు పెట్టుబడుల్ని భారీగా తగ్గిస్తున్నాయని YCP విమర్శలు