News July 30, 2024
ఒంగోలులో నేడు జాబ్ మేళా

ఒంగోలులోని పాత రిమ్స్లోని జిల్లా ఉపాధి కార్యాలయంలో నేడు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి భరద్వాజ్ తెలిపారు. 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన నిరుద్యోగులు 10వ తరగతి నుంచి ఐటీఐ చదివిన వారు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చని ఆయన తెలిపారు. అభ్యర్థులు తమ ధ్రువీకరణ పత్రాలతో నేరుగా జాబ్ మేళాలో పాల్గొనే అవకాశం ఉందని సూచించారు.
Similar News
News March 4, 2026
కలెక్టర్ను కలిసిన MP మాగుంట, MLA జనార్దన్

ఒంగోలు MLA జనార్దన్, MP మాగుంట శ్రీనివాసరెడ్డి మంగళవారం ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబును కలెక్టరేట్లో కలిశారు. నియోజకవర్గ అభివృద్ధిపై వారు చర్చించారు. ఒంగోలులో నెలకొన్న సమస్యలను జనార్దన్ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. పార్లమెంట్ పరిధిలోని సమస్యలను మాగుంట వివరించారు. కలెక్టర్ పరిష్కార దిశగా ప్రయత్నిస్తానని తెలిపారన్నారు.
News March 3, 2026
వెలుగొండ నిర్వాసితులకు న్యాయం ఏది..?

వెలుగొండ ప్రాజెక్టు కింద ముంపుకు గురైన గ్రామాల నిర్వాసితులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు పరిధిలో 11 గ్రామాలు ముంపుకు గురికానుండగా.. పెద్దారవీడు మండలంలోని సుంకేసుల, కలనూతల, గుండంచెర్ల గ్రామాల పరిస్థితి దయనీయంగా ఉందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ఈ వ్యవహారంపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు.
News March 3, 2026
ప్రకాశం SP కార్యాలయానికి 80 అర్జీలు

ప్రకాశం జిల్లా SP కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. SP హర్షవర్ధన్ రాజు ప్రజల నుంచి వచ్చిన 80 వినతి పత్రాలను స్వీకరించారు. సంబంధిత PS అధికారులతో మాట్లాడి చట్టబద్ధంగా సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఫిర్యాదుదారులతో మాట్లాడుతూ.. వారి సమస్యలు పరిశీలించి న్యాయం చేస్తానని భరోసా కల్పించారు. అధికంగా భూ, ఆర్థిక తగాదాలు, అత్తింటి వేధింపులు, ఉద్యోగ మోసాలు వంటివి వచ్చాయన్నారు.


