News July 30, 2024
తొలి విడతలో రుణమాఫీ కాలేదా?

TG: మొదటి దశ రుణమాఫీపై 1.20 లక్షల ఫిర్యాదుల అందినట్లు వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు తెలిపారు. ఆధార్, బ్యాంక్ ఖాతాలో ఒకే విధంగా పేరు లేకపోవడం, 0 నుంచి స్టార్ట్ అయ్యే బ్యాంక్ అకౌంట్లకు రుణమాఫీ కాలేదన్నారు. RBI వివరాల ప్రకారం ఈ టెక్నికల్ సమస్యలను పరిష్కరించడానికి కొంత సమయం పడుతుందన్నారు. వాటిని సరిచేసి RBI నుంచి నిధులు వెనక్కి రాగానే తిరిగి ఆయా రైతుల అకౌంట్లలో జమ చేస్తామని స్పష్టం చేశారు.
Similar News
News April 4, 2026
రూ.1.10కోట్ల విలువైన 3,769 సిలిండర్లు సీజ్

TG: రాష్ట్రంలో ఈ ఏడాది మార్చి 12 నుంచి ఏప్రిల్ 3 వరకు 3,699 డొమెస్టిక్ LPG, 70 చిన్న సిలిండర్లను సీజ్ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. వీటి విలువ రూ.1.10కోట్లుగా పేర్కొంది. 6A కేసులు 1,275 నమోదయ్యాయని, 216 FIRలు నమోదు చేసినట్లు వెల్లడించింది. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో గ్యాస్ కొరత నేపథ్యంలో సిలిండర్లను అక్రమంగా నిల్వ చేసినా, విక్రయించినా ప్రభుత్వం చర్యలు తీసుకొంటున్న సంగతి తెలిసిందే.
News April 4, 2026
అగ్నివీర్ రిక్రూట్మెంట్.. 6 రోజులే ఛాన్స్

ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్మెంట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు ఈ నెల 10 వరకు గడువుంది. 17.5-21 ఏళ్ల వయసున్న అవివాహితులు అర్హులు. నిబంధనల ప్రకారం వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. జనరల్ డ్యూటీకి టెన్త్లో 45%, అగ్నివీర్ టెక్నికల్(MPC)/క్లర్క్/స్టోర్ కీపర్ పోస్టులకు 12thలో 60% మార్కులు వచ్చి ఉండాలి. అప్లికేషన్ ఫీజు ₹250
వివరాలు, దరఖాస్తు సైట్: <
News April 4, 2026
ఒక్కో విద్యార్థిపై రూ.1,08,000 ఖర్చు చేస్తున్నాం: CM

TG పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేసి నర్సరీ నుంచి 12th వరకు నాణ్యమైన విద్యను అందిస్తామని CM రేవంత్ తెలిపారు. 100 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఒక్కో విద్యార్థిపై రూ.1,08,000 ఖర్చు చేస్తున్నామని ఇబ్రహీంపట్నంలో ఓ ప్రైవేట్ స్కూల్ ప్రారంభోత్సవంలో చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్, భోజనం, రవాణా సౌకర్యం కల్పిస్తామన్నారు.


