News July 30, 2024
ఆ రూ.15 వేల కోట్లు అప్పే: జీవీఎల్

AP: అమరావతి నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన రూ.15 వేల కోట్లు అప్పేనని బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు తెలిపారు. కానీ ఆ అప్పును కేంద్రం చెల్లిస్తుందా? రాష్ట్రం చెల్లిస్తుందా అనే దానిపై క్లారిటీ లేదని చెప్పారు. ఈ అప్పు తీర్చేందుకు కనీసం 30 ఏళ్లు పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా ఇటీవల ప్రకటించిన కేంద్ర బడ్జెట్లో అమరావతి నిర్మాణానికి కేంద్రం రూ.15 వేల కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే.
Similar News
News November 9, 2025
ప్రభుత్వాన్ని మార్చడం వల్ల ఇబ్బందులొస్తాయి: లోకేశ్

బిహార్ అభివృద్ధి కోసం NDAను మరోసారి గెలిపించాలని మంత్రి లోకేశ్ ఓటర్లను కోరారు. పట్నాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన అక్కడ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వాన్ని మార్చడం వల్ల ఇబ్బందులొస్తాయని, అభివృద్ధి ఆగిపోతుందని చెప్పారు. గతంలో APలో ఒక్క ఛాన్స్ పేరుతో ఓ పార్టీ అధికారంలోకి రాగానే పరిశ్రమలన్నీ పారిపోయాయని తెలిపారు. ఏపీలో జరిగిన దాన్ని దృష్టిలో ఉంచుకుని బిహార్ యువత మేల్కోవాలని పిలుపునిచ్చారు.
News November 9, 2025
కేటీఆర్ ప్రచారం శ్రీలీల ఐటమ్ సాంగ్ను గుర్తు తెస్తోంది: రేవంత్

TG: రాష్ట్రంలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి చెరిపేస్తే చెరిగిపోయేది కాదని CM రేవంత్ అన్నారు. కానీ జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో కేటీఆర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ‘ప్రేక్షకులను ఉత్తేజపరచడానికి సినిమా మధ్యలో ఐటమ్ సాంగ్స్ వస్తుంటాయి. వాటిని కేటీఆర్ ఆదర్శంగా తీసుకొని మాపై విమర్శలు చేస్తున్నారు. ఆయన తీరు చూస్తుంటే పుష్ప సినిమాలో శ్రీలీల ఐటమ్ సాంగ్ గుర్తొస్తోంది’ అని సెటైర్ వేశారు.
News November 9, 2025
మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ల అరెస్టు

ఇద్దరు భారత మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్లు విదేశాల్లో అరెస్టయ్యారు. భాను రాణా(లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్)ను అమెరికాలో, వెంకటేశ్ గార్గ్(నందు గ్యాంగ్)ను జార్జియాలో అదుపులోకి తీసుకున్నారు. సెక్యూరిటీ ఏజెన్సీలు, హరియాణా పోలీస్ శాఖ కలిసి వారిని పట్టుకున్నాయి. భాను, వెంకటేశ్ను ఇక్కడికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీరిపై హరియాణా, పంజాబ్, ఢిల్లీలో పదుల సంఖ్యలో క్రిమినల్ కేసులున్నాయి.


