News July 30, 2024
లోకుర్.. ఎవరికీ తలొగ్గరు!

TG: విద్యుత్ కమిషన్ నూతన <<13738543>>ఛైర్మన్<<>> జస్టిస్ మదన్ బి లోకుర్ ముక్కుసూటిగా వ్యవహరిస్తుంటారనే పేరుంది. ప్రభుత్వాలు చేసే అన్యాయాలను ఎండగడుతుంటారట. న్యాయవ్యవస్థపై కేంద్రం పెత్తనం చెలాయిస్తోందని, ఇది దేశానికి మంచిది కాదని గతంలో విమర్శలు చేశారు. దర్యాప్తుసంస్థలు రాజకీయ ప్రత్యర్థులను అరెస్ట్ చేసి ఆధారాలు సమర్పించకుండా జైల్లోనే ఉంచే ప్రయత్నాలు చేస్తున్నాయని, కోర్టులు పసిగట్టట్లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Similar News
News November 6, 2025
ONGCలో 2,623 అప్రెంటీస్లు.. దరఖాస్తుకు ఇవాళే లాస్ట్ డేట్

ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కార్పొరేషన్(ONGC)లో 2,623 అప్రెంటీస్ ఖాళీలకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి టెన్త్, డిప్లొమా, ఐటీఐ, డిగ్రీ పాసై, 18-24 ఏళ్లు ఉన్నవారు అర్హులు. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. అభ్యర్థులను విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://ongcindia.com/
News November 6, 2025
అఫ్గాన్తో చర్చలు విఫలమైతే యుద్ధమే: పాక్

ఇవాళ ఇస్తాంబుల్లో శాంతి చర్చల నేపథ్యంలో అఫ్గాన్ ప్రభుత్వానికి పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ హెచ్చరికలు జారీ చేశారు. అఫ్గాన్లో తాలిబన్లను ఎదుర్కోవడానికి సైనిక ఘర్షణే ఏకైక పరిష్కారమా అని రిపోర్టర్ ప్రశ్నించగా.. ‘చర్చలు విఫలమైతే యుద్ధం జరుగుతుంది’ అని ఆసిఫ్ పేర్కొన్నారు. గత నెల ఇరు దేశాల మధ్య కుదిరిన సీజ్ఫైర్ ఒప్పందానికి కొనసాగింపుగా ఇవాళ తుర్కియే, ఖతర్ చొరవతో మరోసారి చర్చలు జరగనున్నాయి.
News November 6, 2025
వంటింటి చిట్కాలు

* పూరీలు తెల్లగా రావాలంటే వాటిని వేయించే నూనెలో రెండు జామాకులు వేసి వేయించాలి.
* పకోడీ, జంతికలు చేసేటప్పుడు పిండిలో కొద్దిగా పాలు పోసి కలిపితే కరకరలాడతాయి.
* ఇడ్లీ, దోశకు బియ్యం నానబెట్టే ముందు కాస్త వేయిస్తే ఇడ్లీ మెత్తగా, దోశలు కరకరలాడుతూ వస్తాయి.
* బంగాళదుంపలతో కలిపి నిల్వ చేస్తే వెల్లుల్లి చాలా కాలం తాజాగా ఉంటాయి.
* అప్పడాలు, వడియాలు వేయించేముందు కాసేపు ఎండలో పెడితే నూనె పీల్చుకోకుండా ఉంటాయి.


