News July 30, 2024

ఒకే గ్రామం నుంచి 20 వేల మంది సైనికులు!

image

సైన్యంలోకి అత్యధిక మందిని పంపిన గ్రామంగా యూపీలోని గహ్మర్ గుర్తింపు పొందింది. ఆ ఊరిలో 20 వేల మంది తాజా, మాజీ సైనికులు ఉండగా అందులో 15వేల మంది రిటైర్డ్ జవాన్లు. వీరిలో 35 మంది కల్నల్స్, 42 మంది లెఫ్టినెంట్ బ్రిగేడియర్ స్థాయి అధికారులు ఉండటం విశేషం. ఆర్మీలో ఎంపికయ్యేందుకు గ్రామంలోని యువకులు ప్రత్యేక కసరత్తులు చేస్తారు. సొంతంగా 1600 మీటర్ల రన్నింగ్ ట్రాక్ ఏర్పాటు చేసుకున్నారు.

Similar News

News February 1, 2025

శ్రీలంకను మట్టికరిపించిన ఆసీస్

image

తొలి టెస్టులో SLను ఆస్ట్రేలియా మట్టికరిపించింది. గాలే వేదికగా జరిగిన టెస్టులో వార్ వన్ సైడ్ అయింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 654-6 వద్ద డిక్లేర్ చేసింది. తొలి INGలో 165కే ఆలౌట్ అయిన శ్రీలంక ఫాలో ఆన్ ఆడింది. 4వ రోజు అందులోనూ 247 పరుగులకే ఆలౌట్ కావడంతో ఆసీస్ ఓ ఇన్నింగ్స్ & 242 రన్స్ తేడాతో గెలుపొందింది. టెస్టుల్లో AUSకు ఇది నాలుగో అతిపెద్ద విజయం. డబుల్ సెంచరీ చేసిన ఖవాజాకు POTM అవార్డు దక్కింది.

News February 1, 2025

చంద్రబాబు సిగ్గుపడాలి: అంబటి రాంబాబు

image

AP: బడ్జెట్ కేటాయింపుల్లో ఏపీ కంటే బిహార్ ఎక్కువ సాధించిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. ఇందులో నితీశ్ కుమార్ విజయాన్ని చూసి CM చంద్రబాబు సిగ్గుపడాలన్నారు. మరోవైపు, తమ నలుగురు కార్పొరేటర్లను టీడీపీలో చేర్చుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెమ్మసాని కార్పొరేటర్ స్థాయికి దిగిపోయారని ఎద్దేవా చేశారు. తిరుపతి Dy. మేయర్‌గా పోటీ చేయాలనుకుంటే శేఖర్ రెడ్డి ఇంటిని కూల్చేశారని మండిపడ్డారు.

News February 1, 2025

క్రికెట్‌కు గుడ్‌బై: సాహా

image

భారత క్రికెటర్ వృద్ధిమాన్ సాహా అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. 28 ఏళ్ల పాటు స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ, క్లబ్, డిస్ట్రిక్ట్, స్టేట్, అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడారు. IPLలో KKR, SRH, GT, పంజాబ్‌కు ఆడారు. కుటుంబంతో సమయం గడిపేందుకు, జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభిస్తున్నట్లు Xలో పోస్ట్ పెట్టారు. సాహా 40 టెస్టుల్లో 1,353 పరుగులు, 9 ODIల్లో 41, 122 FC మ్యాచుల్లో 6,423 రన్స్ చేశారు.