News July 30, 2024
రేపు రాలేను.. త్వరలోనే వస్తా: రాహుల్ గాంధీ

కేరళ: వయనాడ్లో కొండచరియలు విరిగిపడి 123 మంది మృతి చెందారు. ఆ బాధిత కుటుంబాలను కలవడంతో పాటు పరిస్థితిని సమీక్షించడానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీ రేపు వయనాడ్కు వెళ్లాల్సి ఉంది. అయితే ఎడతెరిపిలేని వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పర్యటన వాయిదా వేసుకున్నారు. త్వరలోనే వయనాడ్కు వస్తానని రాహుల్ X వేదికగా హామీ ఇచ్చారు. అటు కేరళకు తమిళనాడు రూ.5కోట్లు విరాళం ప్రకటించింది.
Similar News
News December 27, 2025
విపత్తులతో ₹10.77 లక్షల కోట్ల నష్టం

2025లో ప్రకృతి విపత్తులతో ప్రపంచం వణికింది. హీట్వేవ్స్, కార్చిచ్చు, వరదల వల్ల సుమారు ₹10.77 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని ఒక రిపోర్ట్ వెల్లడించింది. శిలాజ ఇంధనాల వాడకం, క్లైమేట్ చేంజ్ వల్లే ఈ అనర్థాలు జరుగుతున్నాయని హెచ్చరించింది. USలోని కాలిఫోర్నియా ఫైర్స్ వల్ల ఏకంగా ₹5.38 లక్షల కోట్ల నష్టం వచ్చింది. ఆసియాలో తుపాన్లు, వరదలతో వేలమంది చనిపోయారు.
News December 27, 2025
మహాత్ముడి పేరుతో వచ్చిన పథకాన్ని కాపాడుకోవాలి: రేవంత్

TG: జనవరి 5 నుంచి మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం బచావో కార్యక్రమం చేపట్టాలని CWC సమావేశంలో నిర్ణయించినట్లు సీఎం రేవంత్ తెలిపారు. పలు ప్రయోజనాలతో తీసుకొచ్చిన పథకాన్ని రద్దు చేయడాన్ని తీవ్రంగా ఖండించినట్లు Xలో రాసుకొచ్చారు. మహాత్ముడి పేరుతో తీసుకువచ్చిన ఈ పథకాన్ని కాపాడుకోవాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. దీని కోసం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
News December 27, 2025
అల్లు అర్జున్ను మళ్లీ అరెస్ట్ చేస్తారా?

‘పుష్ప-2’ తొక్కిసలాట ఘటనపై పోలీసులు <<18684964>>ఛార్జ్షీట్<<>> దాఖలు చేయడంపై మరోసారి హీరో అల్లు అర్జున్ పేరు తెరపైకి వచ్చింది. ఆయనను ఏ-11గా పేర్కొనడంతో బన్నీని మళ్లీ అరెస్ట్ చేస్తారా? అని అభిమానుల్లో ఆందోళన మొదలైంది. అయితే ఛార్జ్షీట్ అనేది కేసు పూర్తి వివరాలతో కోర్టుకు సమర్పించే నివేదిక. ఇక్కడ సంధ్య థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట జరిగిందని పోలీసులు అందులో పేర్కొనడంతో బన్నీ అరెస్ట్ ఉండకపోవచ్చు!


