News July 31, 2024

మహిళల బలోపేతం కోసమే మహిళా శక్తి : కలెక్టర్

image

ఖమ్మం: మహిళలను ఆర్ధికంగా బలోపేతం చేయడమే మహిళా శక్తి పధకం ముఖ్య ఉద్దేశ్యమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. మంగళవారం నగరంలోని టేకులపల్లి మహిళా ప్రాంగణంలో మహిళా సమాఖ్యలకు నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. సంఘసభ్యులు, మహిళలకు జీవనోపాధి కల్పించాలని, వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలని పేర్కొన్నారు.

Similar News

News January 20, 2026

ఖమ్మం: ఇంటర్ పరీక్షలకు సిద్ధం.. 66 కేంద్రాల ఏర్పాటు

image

ఖమ్మం జిల్లాలో ఫిబ్రవరి 25 నుంచి జరిగే ఇంటర్ పరీక్షలకు యంత్రాంగం సిద్ధమైంది. మొత్తం 35,188 మంది విద్యార్థుల కోసం 66 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 2నుంచి ప్రాక్టికల్స్ ప్రారంభం కానున్నాయి. అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి అధికారులతో సమీక్షించి, కేంద్రాల్లో సీసీ కెమెరాలు, తాగునీరు వంటి సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించేలా చర్యలు చేపడుతున్నట్లు DIEO రవిబాబు తెలిపారు.

News January 20, 2026

ఖమ్మం మార్కెట్‌లో ‘మిర్చి’ ఘాటు.. పత్తి ధరకూ రెక్కలు!

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో వాణిజ్య పంటల ధరలు ఊపందుకున్నాయి. దేశీయంగా డిమాండ్ పెరగడంతో తేజ రకం మిర్చి క్వింటాలు గరిష్ఠంగా రూ.16,300 పలికింది. అటు పత్తి ధర కూడా వారం వ్యవధిలో రూ.1,000 పెరిగి క్వింటాలు రూ.8,000కు చేరడంతో రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ఒక్కరోజే సుమారు 30 వేల బస్తాల మిర్చి అమ్మకానికి రాగా, మార్కెట్ ఛైర్మన్ కొనుగోళ్లను పర్యవేక్షించారు.

News January 20, 2026

రేపు ఖమ్మంలో జాబ్ మేళా

image

నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కల్పనకు రేపు( బుధవారం) ఖమ్మంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి శ్రీరాం తెలిపారు. ముస్తఫానగర్‌లోని వీవీసీ డెవలప్మెంట్ సెంటర్‌లో టెలీకాలర్, సేల్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఇంటర్వ్యూలు జరుగుతాయని చెప్పారు. పదో తరగతి నుంచి డిగ్రీ అర్హత, 18-32 ఏళ్ల వయస్సు గల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.