News July 31, 2024
సిద్దిపేట: ‘ఆరోగ్య సిబ్బంది ఫీవర్ సర్వే నిర్వహించాలి’

పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యమని సిద్దిపేట జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ అన్నారు. సిద్దిపేటలో ఆయన అధ్యక్షతన జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేస్తున్న వైద్య అధికారులకు, RBSK వైద్య అధికారులకు, MLHPలకు, వాతావరణ మార్పుల వల్ల వచ్చే సీజనల్ వ్యాధులపై సమీక్ష నిర్వహించారు. వ్యాధుల బారిన పడకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని సిబ్బందికి సూచించారు.
Similar News
News January 19, 2026
మెదక్: పింఛన్ డబ్బుల కోసం తల్లిని చంపిన కొడుకు

మెదక్ మండలం రాజ్పల్లిలో దారుణం జరిగింది. మద్యం తాగేందుకు తన పింఛన్ డబ్బులు, బంగారం ఇవ్వలేదన్న కోపంతో చాకలి రాములు తన కన్నతల్లి నరసమ్మను కట్టెతో కొట్టి దారుణంగా హత్య చేశాడు. సమాచారం అందుకున్న రూరల్ ఎస్సై లింగం సంఘటనా స్థలానికి చేరుకుని, నిందితుడిపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
News January 19, 2026
మెదక్: 267 పాఠశాలల్లో టాయిలెట్ల నిర్మాణం

జిల్లాలోని 267 పాఠశాలల్లో ఉపాధి హామీ పథకం కింద 388 టాయిలెట్లు మంజూరైనట్లు డీఈఓ విజయ తెలిపారు. ఒక్కో యూనిట్కు రూ. 2 లక్షలు కేటాయించామన్నారు. బాలురు, బాలికలకు ప్రత్యేకంగా నిర్మించే ఈ పనులను సర్పంచులతో సమన్వయం చేసుకుని వెంటనే ప్రారంభించాలని హెచ్ఎంలు, ఎంఈఓలను ఆదేశించారు. పనుల్లో జాప్యం లేకుండా నాణ్యతతో పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
News January 19, 2026
‘మెదక్ జిల్లాను చార్మినార్ జోన్లో కలపాలి’

మెదక్ జిల్లాను చార్మినార్ జోన్లో కలపాలని జిల్లా వ్యాప్తంగా తహశీల్దార్కు వినతిపత్రాలు అందజేశారు. మెదక్ జిల్లాని రాజన్న సిరిసిల్ల జోన్లో గత ప్రభుత్వం అనాలోచితంగా కలిపిందని పలువురు ఆరోపించారు. నిరుద్యోగులు గ్రేడ్-4 స్థాయి ఉద్యోగాలకే పరిమితమయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. చార్మినార్ జోన్లో కలిపి ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలని కోరారు.


