News July 31, 2024
ఆగస్టు 2, 3 తేదీల్లో గవర్నర్ల సదస్సు

ప్రెసిడెంట్ ద్రౌపదీ ముర్ము అధ్యక్షతన ఆగస్టు 2, 3 తేదీల్లో ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో గవర్నర్ల సదస్సు జరగనుంది. ఉప రాష్ట్రపతి జగదీప్, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులతో పాటు అన్ని రాష్ట్రాల గవర్నర్లు హాజరుకానున్నారు. నూతన క్రిమినల్ చట్టాలు, ఉన్నత విద్యలో సంస్కరణలు, గిరిజన ప్రాంతాల అభివృద్ధి, సేంద్రియ వ్యవసాయం, మై భారత్, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ తదితర అంశాలపై చర్చిస్తారు.
Similar News
News April 3, 2026
రాజధానిపై వైసీపీకి క్లారిటీ లేదా?

AP: రాజధానిపై YS జగన్, ఆ పార్టీ ముఖ్య నేతల స్టేట్మెంట్లు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయి. ‘మావిగన్’ను రాజధాని చేయాలని జగన్ అంటుంటే.. తాము అమరావతికి వ్యతిరేకం కాదని వైవీ సుబ్బారెడ్డి సహా ఇతర ఎంపీలు చెబుతున్నారు. రాజధానికి భూములిచ్చిన రైతులకు న్యాయం చేయలేదని, అందుకే బిల్లును వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో రాజధానిపై వైసీపీకి క్లారిటీ ఉందా? లేదా? అన్న సందేహం ప్రజల్లో వ్యక్తమవుతోంది.
News April 3, 2026
ఐశ్వర్యరాయ్తో విడాకుల పుకార్లు.. అభిషేక్ ఏమన్నారంటే?

విడాకుల పుకార్లను పట్టించుకోకుండా ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకమే తమను ఇన్నాళ్లు కలిపి ఉంచిందని అభిషేక్ బచ్చన్ ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ఐశ్వర్యా రాయ్తో 18 ఏళ్ల వైవాహిక బంధం వెనుక ఉన్న రహస్యాన్ని ఆయన పంచుకున్నారు. తమ వైవాహిక జీవితం నిలబడటానికి ‘తీవ్రమైన అహం’ కారణమని అభిషేక్ చెప్పారు. అయితే ఇక్కడ ‘అహం’(Ego) అంటే గర్వం కాదని, బంధాన్ని కాపాడుకోవాలనే పట్టుదల &ఆత్మగౌరవం అని వివరించారు.
News April 3, 2026
ట్రేడ్ డీల్.. ₹కోటి వరకు కార్ల ధరలు తగ్గింపు!

గతేడాది జరిగిన ఇండియా, UK ట్రేడ్ డీల్ నేపథ్యంలో జాగ్వార్ లాండ్ రోవర్ కార్ల ధరలు తగ్గనున్నాయి. ఇంపోర్ట్ డ్యూటీ 110% నుంచి 30 శాతానికి పడిపోవడం, GST సర్దుబాటుతో ధరలను 13-25% వరకు కంపెనీ తగ్గించనుందని తెలుస్తోంది. UKలో బిల్ట్ చేసిన టాప్ వేరియంట్లపై ₹1.06Cr ఆదా అవుతుందని సమాచారం. రేంజ్ రోవర్ స్పోర్ట్SV ఎడిషన్ రేటు ₹2.75Cr నుంచి ₹2.35Crకు, 4.4 లీటర్ పెట్రోల్SV ధర ₹4.25 Cr నుంచి ₹3.19Crకు దిగిరానుంది.


