News July 31, 2024

మందస: రోడ్డు ప్రమాద మృతుల వివరాలు లభ్యం

image

శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరం జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువతీ, యువకుడు మృతిచెందిన విషయం విదితమే. మృతులు మందస మండలం కడుముసాయి గ్రామానికి చెందిన సవర హర్యాని(25), సవర జీవన్ (21)గా పోలీసులు గుర్తించారు. ఇందులో వదిన, మరిది దుర్మరణం పాలయ్యారు. తణుకు నుంచి బైక్ పై గ్రామానికి వస్తుండగా మార్గమధ్యలో ఘటన జరిగింది. శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు.

Similar News

News March 4, 2026

ఎచ్చెర్ల: డిగ్రీ విద్యార్థులకు గమనిక

image

ఎచ్చెర్ల డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ 4వ సెమిస్టర్ షెడ్యూల్‌ను యూనివర్సిటీ డీన్ అనురాధ బుధవారం విడుదల చేశారు. మార్చి 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఎటువంటి అపరాధ రుసుం లేకుండా పరీక్షల ఫీజును చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఈ పరీక్షలు ఏప్రిల్ 7వ తేదీ నుంచి జరుగుతాయని తెలిపారు.

News March 4, 2026

శ్రీకాకుళం: సకాలంలో పంచాయతీ ఎన్నికలు లేనట్టే?

image

ప్రభుత్వం సకాలంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదని అధికార వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 2 న సర్పంచుల పదవీకాలం ముగుస్తుండటంతో, ప్రత్యేక అధికారుల నియామకానికి కసరత్తు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో 912 పంచాయతీలు, 657 గ్రామ సచివాలయాలు ఉన్నాయి. సర్పంచ్, వార్డుల రిజర్వేషన్ ఖరారు సైతం జరగలేదు. ఎన్నికలపై స్పష్టత వచ్చేవరకు ప్రత్యేక అధికారులతో పాలన కొనసాగనుంది.

News March 4, 2026

శ్రీకాకుళం: పాలిటెక్నిక్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

పాలిటెక్నిక్ డిప్లమా ప్రవేశాల పరీక్ష పాలిసెట్-2026కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు శ్రీకాకుళం పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్, కన్వీనర్ నారాయణరావు బుధవారం తెలిపారు. ప్రవేశ పరీక్షకు పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు అర్హులుగా చెప్పారు. https://polycetap.ap.gov. ఇన్ వెబ్సైట్లో ఏప్రిల్ 4లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పది కళాశాలలు ఉన్నాయన్నారు.