News July 31, 2024

ఎల్లుండి NEET-UG రాష్ట్ర ర్యాంకుల జాబితా విడుదల

image

AP: నీట్-యూజీ రాష్ట్ర ర్యాంకుల జాబితా వచ్చే నెల 2న విడుదల కానుంది. ఇప్పటికే జాతీయ స్థాయిలో ర్యాంకుల్ని కేంద్రం ప్రకటించింది. దాన్ని అనుసరించి ఎల్లుండి రాష్ట్ర స్థాయి ర్యాంకుల్ని డా.ఎన్టీఆర్ వర్సిటీ అనౌన్స్ చేయనుంది. ఇక వచ్చే నెల 14 నుంచి MBBS అకడమిక్ సెషన్ స్టార్ట్ అవుతుందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ తెలిపింది. ఆగస్టు తొలివారంలోనే కౌన్సెలింగ్ ప్రక్రియ ఉంటుందని పేర్కొంది.

Similar News

News February 2, 2025

నేటి ముఖ్యాంశాలు

image

* రూ.50.65లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్
* ఇది 140కోట్ల మంది ఆశల బడ్జెట్: PM మోదీ
* రూ.12 లక్షల వరకు నో IT
* బడ్జెట్‌ను స్వాగతించిన CBN, పవన్
* APలో మరో 7 ఎయిర్‌పోర్టులు: రామ్మోహన్
* AP పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ABV
* లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్ అందుకున్న సచిన్
* TGకు బడ్జెట్లో మొండిచెయ్యి: హరీశ్ రావు
* 5న TG క్యాబినెట్ భేటీ, అసెంబ్లీ ప్రత్యేక సమావేశం

News February 2, 2025

షర్మిలతో విజయసాయిరెడ్డి భేటీ?

image

AP: రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో YCP మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి భేటీ అయినట్లు తెలుస్తోంది. 3 రోజుల కిందట హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో దాదాపు 3 గంటల పాటు సమావేశం అయినట్లు సమాచారం. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన రాజకీయ అంశాలు చర్చకు వచ్చినట్లు వినికిడి. ఇటీవల వైసీపీ, రాజకీయాలకు గుడ్ బై చెప్పిన VSR షర్మిలతో రహస్యంగా భేటీ కావడంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.

News February 2, 2025

ఉప్పు గనుల్లో ఉంచి చికిత్స చేస్తారు!

image

ఆస్తమా రోగులకు వినూత్నంగా చికిత్స అందిస్తోంది ఉక్రెయిన్. అక్కడున్న ఉప్పు గనుల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక రిసార్ట్ ఉబ్బసం రోగులకు ట్రీట్మెంట్ ఇస్తోంది. గనిలోని అధిక ఉప్పు సాంద్రత ఒక మైక్రోక్లైమేట్‌ను సృష్టించి ఊపిరితిత్తులను పొడిగా ఉంచడంలో సహాయపడుతుందని వైద్యులు చెబుతున్నారు. రోగులు గనిలోనే కొంత సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల శ్వాసకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని నమ్ముతారు.