News July 31, 2024

నెల్లూరు: ఇద్దరి ఈవోలపై 54 అభియోగాలు

image

జొన్నవాడ మల్లికార్జునస్వామి కామాక్షితాయి ఆలయంలో అవినీతి జరిగిందని ఆరోపణలున్నాయి. ఆ సమయంలో ఈవోలుగా పనిచేసిన గిరికృష్ణ, వెంకటేశ్వర్లు ఉన్నారు. దీనిపై కోవూరు MLA వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి మంత్రి ఆనం దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి డిప్యూటీ కమిషనర్‌ కె.వి.శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని నియమించారు. గిరికృష్ణపై 26, వెంకటేశ్వర్లుపై 28 అభియోగాలు నమోదు చేశారు. దీంతో ఇరువురిని సస్పెండ్‌ చేశారు.

Similar News

News March 6, 2026

100% ఉత్తీర్ణతే లక్ష్యంగా 100 రోజుల యాక్షన్ ప్లాన్: DEO

image

ప్రభుత్వ పాఠశాలల్లో 10 తరగతి చదివే విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్లు DEO బాలాజీరావు తెలిపారు. గురువారం కందుకూరు వచ్చిన ఆయన పక్కా ప్రణాళికతో లక్ష్యాన్ని సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్ 6 తేదీ నుంచి 100 రోజుల ప్రణాళికను అమలు చేస్తున్నామని తెలిపారు. విద్యార్థుల ప్రతిభా స్థాయిని బట్టి 4 కేటగిరీలుగా విభజించి ప్లాన్ ప్రకారం బోధన చేయిస్తున్నట్లు చెప్పారు.

News March 5, 2026

100% ఉత్తీర్ణతే లక్ష్యంగా 100 రోజుల యాక్షన్ ప్లాన్: DEO

image

ప్రభుత్వ పాఠశాలల్లో 10 తరగతి చదివే విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్లు DEO బాలాజీరావు తెలిపారు. గురువారం కందుకూరు వచ్చిన ఆయన పక్కా ప్రణాళికతో లక్ష్యాన్ని సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్ 6 తేదీ నుంచి 100 రోజుల ప్రణాళికను అమలు చేస్తున్నామని తెలిపారు. విద్యార్థుల ప్రతిభా స్థాయిని బట్టి 4 కేటగిరీలుగా విభజించి ప్లాన్ ప్రకారం బోధన చేయిస్తున్నట్లు చెప్పారు.

News March 5, 2026

వెంకటగిరి: ఈ అమ్మాయిలు బంగారం.!

image

వెంకటగిరిలో విద్యార్థులు తమకు దొరికిన బంగారాన్ని పోలీసులకు అప్పజెప్పి మానవత్వం చాటుకున్నారు. కాజీపేటలో మార్గంలోని SBI బ్యాంక్ సమీపంలో రోడ్డుపై ZP బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులకు రూ.6,28,500 విలువ గల 4.5 సవర్ల బంగారం దొరికింది. వారు బంగారాన్ని ఎస్ఐ స్వరూపకు అందించారు. ఆ బంగారం పట్టణంలోని మహాలక్ష్మిదిగా గుర్తించి ఆమెకు అప్పగించారు. ఈ మేరకు విద్యార్థులను SI, బాధితురాలు అభినందించారు.