News July 31, 2024

కర్నూలు: పింఛన్ల పంపిణీకి రూ.103.54 కోట్లు

image

ఆగస్టు 1న ఉదయం 6 గంటలకే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ప్రక్రియ ప్రారంభించాలని, మొదటి రోజే 96 శాతానికిపైగా పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు. పింఛన్ల పంపిణీపై మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. అనంతరం కలెక్టర్ రంజిత్ బాషా పింఛన్ల పంపిణీపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాకు రూ.103.54 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందని చెప్పారు.

Similar News

News February 28, 2026

కర్నూలు: ‘పరిశ్రమల స్థాపనకు అనుమతులు ఇవ్వాలి’

image

కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ సిరి శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిశీలించారు. పెండింగ్ లేకుండా త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలన్నారు. ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం కింద వచ్చిన దరఖాస్తులకు త్వరితగతిన రుణాలు మంజూరు చేయాలన్నారు.

News February 28, 2026

కర్నూలు: ‘ఏప్రిల్ నాటికి 23,077 గృహాలకు సోలార్’

image

కర్నూలు కలెక్టరేట్ కార్యాలయంలో విద్యుత్ శాఖాధికారులు, కాంట్రాక్టర్లతో జిల్లా కలెక్టర్ సిరి సమీక్ష నిర్వహించారు. పీఎం సూర్యఘర్ పథకం కింద జిల్లాలోని 23,077 ఎస్సీ/ఎస్టీ లబ్ధిదారుల ఇళ్లపై ఏప్రిల్ నాటికి సోలార్ ఇన్‌స్టాలేషన్లు పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఇన్వర్టర్లు, మీటర్లు, ఎర్త్ వైరింగ్‌లో నాణ్యత పాటించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న పీఎం కుసుమ్ పనులను వెంటనే ప్రారంభించాలన్నారు.

News February 28, 2026

కర్నూలు: ‘ఈ ఏడాదికి 45 లక్షల మొక్కలు నాటాలి’

image

కర్నూలు కలెక్టరేట్‌లో శనివారం 2026-27 ఆర్థిక సంవత్సరంలో చేపట్టబోయే Plantation గురించి జిల్లా కలెక్టర్ సిరి శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 2026-27 ఆర్థిక సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా భారీ ఎత్తున ప్లాంటేషన్ కార్యక్రమాన్ని చేపట్టాలని, అందుకుగాను 45 లక్షల మొక్కలను నాటడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.