News July 31, 2024

విశాఖ: రైళ్లు రద్దు వివరాలకోసం కోసం హెల్ప్ లైన్

image

చక్రధర్ పూర్ డివిజన్‌లో ముంబయి (12810) ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పడంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని వాల్తేర్ సీనియర్ డీసీఎం సందీప్ తెలిపారు. దీంతో పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు కొన్నింటిని దారి మళ్లించి నడపనున్నట్లు ప్రకటించారు. రైళ్లతో పాటు, ఇతర సమాచారం ప్రయాణికులకు చేరవేసేందుకు హెల్ప్ లైన్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సమాచారం కోసం 0801-2746330, 0891-2744619 సంప్రదించాలన్నారు.

Similar News

News March 17, 2026

విశాఖ: అవినీతి ఆరోపణలు.. నలుగురు పోలీసుల బదిలీ

image

విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి తనదైన శైలిలో కొరడా ఝలిపిస్తున్నారు. టాస్క్‌ఫోర్స్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కానిస్టేబుళ్లు గోపికృష్ణ, అగస్టీన్, శివకృష్ణ, సుధాకర్‌లను నగరంలోని పలు స్టేషన్‌లకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు నాలుగు రోజులు ముందే డీవోలు సిద్ధమైనా.. సంబంధిత స్టేషన్‌కు ఆలస్యంగా అందాయి.

News March 17, 2026

విశాఖ నుంచి బెంగళూరు, చర్లపల్లి రైళ్లు క్రమబద్ధీకరణ

image

విశాఖపట్నం నుంచి నడిచే రెండు ప్రత్యేక రైళ్లను ఈస్ట్ కోస్ట్ రైల్వే క్రమబద్ధీకరించింది. విశాఖ-SMVT బెంగళూరు (18509/10) వీక్లీ ఎక్స్‌ప్రెస్ ప్రతి ఆదివారం, విశాఖ-చర్లపల్లి (18527/28) వీక్లీ ఎక్స్‌ప్రెస్ ప్రతి శుక్రవారం అందుబాటులో ఉంటాయి. బెంగళూరు రైలు రేణిగుంట మీదుగా, చర్లపల్లి రైలు వరంగల్ మీదుగా ప్రయాణిస్తాయి. ప్రయాణికులు ఈ శాశ్వత సేవలను వినియోగించుకోవాలని రైల్వే శాఖ కోరింది.

News March 17, 2026

జీవీఎంసీలో ప్రత్యేక అధికారుల పాలన చరిత్ర(2/2)

image

విశాఖ జీవీఎంసీలో పలుమార్లు ప్రత్యేక అధికారుల పాలన కొనసాగింది. 2000-2007 ఏళ్ల మధ్య ఎక్కువ కాలం ప్రత్యేక అధికారుల పాలన సాగింది. 2012 నుంచి 2021 వరకు సుమారు 9 ఏళ్లపాటు కూడా ఎన్నికలు జరగక జిల్లా కలెక్టర్లే ప్రత్యేక అధికారులుగా వ్యవహరించారు. ఈ సమయంలో కార్పొరేషన్‌ పాలన, అభివృద్ధి పనులు అధికారుల ఆధ్వర్యంలోనే సాగాయి. 2021లో ఎన్నికలు జరిగి ప్రజాప్రతినిధులు బాధ్యతలు చేపట్టి అయిదేళ్ల ప్రయాణం పూర్తి చేశారు.